YS Sharmila : రేపు ఖమ్మం జిల్లాలో షర్మిల నిరాహార దీక్ష

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 20న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెనుబల్లి మండలం గంగాదేవిపాడులో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

YS Sharmila : రేపు ఖమ్మం జిల్లాలో షర్మిల నిరాహార దీక్ష

YS Sharmila:వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 20న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెనుబల్లి మండలం గంగాదేవిపాడులో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

షర్మిల నిరాహార దీక్ష వివరాలను ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి ఆదివారం వెల్లడించారు. ఈ నెల 20తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షర్మిల దీక్ష కొనసాగిస్తారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలపాలని కోరారు.