COVID-19 TG : తెలంగాణలో ఒక్కరోజే 2, 478 కరోనా కేసులు, ఐదుగురు మృతి
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
Telangana corona : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో వందల సంఖ్యలో ఉంటే..ఇప్పుడు రెండు వేలకు మించి పాజిటివ్ కేసులు నమోదువుతుండడంతో కలవరం స్టార్ట్ అయ్యింది. గత 24 గంటల్లో 2 వేల 478 కరోనా కేసులు రికార్డు కాగా..ఐదుగురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 వేల 472 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీలో 402, మేడ్చల్ లో 208, నిజామాబాద్ జిల్లాలో 176 కరోనా కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ 72. భద్రాద్రి కొత్తగూడెం 35. జీహెచ్ఎంసీ 402. జగిత్యాల 105. జనగాం 23. జయశంకర్ భూపాలపల్లి 11. జోగులాంబ గద్వాల 09. కామారెడ్డి 98. కరీంనగర్ 87. ఖమ్మం 54. కొమరం భీం ఆసిఫాబాద్ 67. మహబూబ్ నగర్ 96. మహబూబాబాద్ 16. మంచిర్యాల 85. మెదక్ 33. మేడ్చల్ మల్కాజ్ గిరి 208. ములుగు 04. నాగర్ కర్నూలు 43. నల్గొండ 88. నారాయణపేట 16. నిర్మల్ 111. నిజామాబాద్ 176. పెద్దపల్లి 33. రాజన్న సిరిసిల్ల 61. రంగారెడ్డి 162. సంగారెడ్డి 79. సిద్దిపేట 54. సూర్యాపేట 39. వికారాబాద్ 55. వనపర్తి 33. వరంగల్ రూరల్ 14. వరంగల్ అర్బన్ 82. యాదాద్రి భువనగిరి 27. మొత్తం 2478
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.09.04.2021)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/EBKHlZsDYZ— IPRDepartment (@IPRTelangana) April 9, 2021
Read More : Vakeel Saab Movie : గద్వాలలో పవన్ ఫ్యాన్స్ వీరంగం, థియేటర్ తలుపులు ధ్వంసం