Telangana Covid Figure : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో మరోరోజు 500లకిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.(Telangana Covid Figure)
Telangana Covid Figure : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో మరోరోజు 500లకిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
మంగళవారం(జూన్ 21) రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం(జూన్ 22) 434 కేసులు, గురువారం(జూన్ 23) 494 కేసులు, శుక్రవారం(జూన్ 24) 493 కేసులు, శనివారం(జూన్ 25) 496 కేసులు, ఆదివారం(జూన్ 26) 434 కేసులు, సోమవారం(జూన్ 27) 477 కేసులు, మంగళవారం(జూన్ 28) 459 కేసులు, గురువారం(జూన్ 30) 468 కేసులు, శుక్రవారం(జులై 1) 462 కేసులు, శనివారం(జులై 2) 516 కేసులు, ఆదివారం(జులై 3) 457 కేసులు, సోమవారం(జులై 4) 443 కేసులు, మంగళవారం (జులై 5) 552 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 563గా(జులై 6) ఉంది.((Telangana Covid Figure))
Booster Dose: బూస్టర్ డోసు కాల పరిమితి తగ్గించిన కేంద్రం.. ఇకపై ఆరు నెలలే!
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25వేల 801 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 563 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 297 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 64, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 46, సంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 434 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
Zika Virus : తెలంగాణలో జికా వైరస్ టెన్షన్.. అసలే వర్షాకాలం జర భద్రం!
రాష్ట్రంలో నేటివరకు 8,03,937 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 94వేల 944 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల మార్క్ కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 882కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
అటు.. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. మంగళవారం 4.54 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 16వేల 159 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు 3.56 శాతంగా నమోదైంది. మహారాష్ట్ర, కేరళలో వైరస్ కట్టడిలోనే ఉండగా.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతున్నాయి.
24 గంటల వ్యవధిలో మరో 15వేల 394 మంది కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో మరో 28 మంది కొవిడ్ తో మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,15,212 (0.26 శాతం)కి పెరిగాయి. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.29 కోట్ల మంది(98.53 శాతం) కోలుకున్నారు. నేటివరకు దేశవ్యాప్తంగా కొవిడ్ తో 5.25 లక్షల మంది మరణించారు. నిన్నటివరకూ 198 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.06.07.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/rliXoymOZq— IPRDepartment (@IPRTelangana) July 6, 2022
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.06.07.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/rliXoymOZq— IPRDepartment (@IPRTelangana) July 6, 2022