Telangana Debt : తెలంగాణ రాష్ట్రం అప్పులు గణనీయంగా పెరిగాయి.. వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Telangana Debt : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని వెల్లడించారు. 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ. 4,33,817.6 కోట్లు ఉన్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపి చేసిన అప్పుగా పేర్కొంది.
AP Telangana Debts : అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు.. ఏపీ, తెలంగాణ అప్పుల వివరాలు విడుదల
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రూ. 75,577 కోట్ల అప్పులు ఉన్నాయని, 2021-22 నాటికి అవి రూ. 2,83,452 కోట్లకు చేరాయని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. 2014-15లో రూ. 8,121 కోట్లు, 2015-16లో రూ. 15,515 కోట్లు, 2016-17లో రూ. 30,319 కోట్లు, 2017-18లో రూ. 22,658 కోట్లు, 2018-19లో రూ. 23,091 కోట్లు, 2019-20లో రూ. 30,577 కోట్లు, 2020-21లో రూ. 38,161 కోట్లు, 2021-22లో రూ. 39,433 కోట్లకు పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ లోక్ సభలో వెల్లడించింది.
CM Jagan On AP Debts : గతంలో చేసిన అప్పులకంటే ఇప్పుడు చేసిన అప్పులే చాలా తక్కువ-సీఎం జగన్
అదేవిధంగా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం భారీగానే రుణాలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు నాబార్డు, ఇతర కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు రూ. 1,50,365.60 కోట్లు తీసుకున్నట్లుగా వివరాల్లో కేంద్రం పేర్కొంది. మొత్తం 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు రూ. 1,30,365.60 కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. రూరల్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. వేర్ హౌస్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ నుంచి రూ. 972 కోట్లు మంజూరు కాగా రూ. 852 కోట్లు విడుదల చేశారని, ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ నుంచి 2015-16, 2016-17లో రూ. 28 కోట్లు మంజూరు కాగా రూ. 10 కోట్లు విడుదల అయ్యాయని, నబార్డ్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్మెంట్ అసిస్టెన్స్ నుంచి వివిధ పథకాల అమలు కోసం రూ. 14,516.65 కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్రం తెలిపింది.