YS Sharmila : తెలంగాణ యూనివర్సిటీలో వైఎస్ షర్మిల దీక్ష

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోజు రోజుకూ యాక్టివ్ అవుతున్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో షర్మిల దీక్ష చేయనున్నారు.

YS Sharmila : తెలంగాణ యూనివర్సిటీలో వైఎస్ షర్మిల దీక్ష

Sharmila Deeksha

Telangana University : తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోజు రోజుకూ యాక్టివ్ అవుతున్నారు. నిరుద్యోగ దీక్ష పేరుతో ప్రతి మంగళవారం షర్మిల దీక్ష చేస్తున్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో షర్మిల దీక్ష చేయనున్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ యూనివర్సిటీ ప్రాంగణంలోని దీక్ష చేపట్టారు.

కాగా, వైఎస్ షర్మిల అక్టోబ‌ర్ నుంచి పాద‌యాత్ర చేప‌ట్ట‌బోతున్న‌ట్టు గ‌తంలోనే ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. పాద‌యాత్ర‌కు సంబంధించిన రూట్ మ్యాప్‌, విధివిధానాల‌పై ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో షర్మిల ఇప్ప‌టికే చ‌ర్చించారు. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ తెలంగాణ‌లో చేప‌ట్టిన ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర పేరుతోనే యాత్రను కొన‌సాగించాల‌ని ష‌ర్మిల నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.

YS Sharmila : అధికారంలోకి వస్తే ట్యాంక్ బండ్‌పై బీసీ నేతల విగ్రహాలు

గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎక్క‌డి నుంచైతే పాద‌యాత్ర‌ను ప్రారంభించారో అక్క‌డి నుంచే అంటే చేవెళ్ల నియోజ‌కవర్గం నుంచే పాద‌యాత్ర‌ను చేప‌ట్టేందుకు ష‌ర్మిల సిద్ధం అవుతున్నారు. ఏడాదిపాటు పాద‌యాత్ర కొన‌సాగేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. చేవెళ్లలో ప్రారంభించి తిరిగి చేవెళ్లలో ముగిసేలా పాద‌యాత్ర రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు.