ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు : 24 గంటల్లో 620 మాత్రమే

  • Published By: bheemraj ,Published On : November 29, 2020 / 06:22 PM IST
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు : 24 గంటల్లో 620 మాత్రమే

Updated On : November 29, 2020 / 6:50 PM IST

AP corona new cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 620 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఏడుగురు చనిపోయారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.



రాష్ట్రంలో గత 24 గంటల్లో 54, 710 శాంపిల్స్ ను పరీక్షించగా 620 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. కోవిడ్ వల్ల కృష్ణలో 2, విశాఖపట్నం 2, చిత్తూరులో 1, గుంటూరు 1, పశ్చిమగోదావరి ఒకరు చొప్పున మృతి చెందారు.



గడిచిన 24 గంటల్లో 3,787 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 1,00, 17,126 శాంపిల్స్ ను పరీక్షించారు.



రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,67,683. ఏపీలో మొత్తం యాక్టివ్ కేసులు 8,397. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,52,293 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో మొత్తం 6,988 మంది మృతి చెందారు.