AP Covid Update : ఏపీలో కొత్తగా 160 కోవిడ్ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, తిరుపతిలలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనే అంశం  ప్రజలను భయపెడుతోంది. 

AP Covid Update : ఏపీలో కొత్తగా 160 కోవిడ్ కేసులు నమోదు

AP Covid Cases Update

Updated On : December 12, 2021 / 6:14 PM IST

AP Covid Update :  ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, తిరుపతిలలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనే అంశం  ప్రజలను భయపెడుతోంది.  విజయనగరంలో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా తిరుపతిలో మరోక వ్యక్తికి   ఒమిక్రాన్ సోకినట్లు  తెలుస్తోంది. అతని జినోమ్  పరీక్షల నివేదిక రావాల్సి ఉంది.  మరో వైపు ఏపీ లో కోవిడ్ కేసులు సంఖ్య నిలకడగా ఉంది.

రాష్ట్రంలో నిన్న కొత్తగా 160 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 201 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం1,912 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,868 కి చేరింది.

Also Read :Shilpa Chowdary : మూడు రోజుల కస్టడీలోనూ సహకరించని శిల్పా చౌదరి

వీరిలో 20,58,490 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏపీలో గత 24 గంటల్లో కృష్ణాజిల్లాలో ఒకరు కోవిడ్ తో మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,466కు చేరింది. నిన్నటివరకు రాష్ట్రంలో 3,07,77,396 మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Ap Covid 19 Update

Ap Covid 19 Update