Amaravati : అమరావతే ఏపీ రాజధాని- పార్లమెంటు సాక్షిగా మరోసారి స్పష్టత ఇచ్చిన కేంద్రం

28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఆ జాబితాలో ఏపీ రాజధానిగా అమరావతి పేరును ప్రస్తావించింది.

Amaravati : అమరావతే ఏపీ రాజధాని- పార్లమెంటు సాక్షిగా మరోసారి స్పష్టత ఇచ్చిన కేంద్రం

AP Capital Amaravati

ఏపీ రాజధానిపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. అమరావతే ఏపీ రాజధాని అని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను కేంద్రం ఆమోదించినట్లు పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఆ జాబితాలో ఏపీ రాజధానిగా అమరావతి పేరును ప్రస్తావించింది.

రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నలకు కేంద్రం స్పష్టత ఇచ్చింది. దేశంలోని చాలా (39శాతం) రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదనేది నిజమా? కాదా? అని ఎంపీ జావెద్ ప్రశ్నించారు. ఎంపీ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి కౌశల్ కిశోర్ వివరణ ఇచ్చారు. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తవం అన్నారు.

Also Read : రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది : జేసీ ప్రభాకర్ రెడ్డి

ఏపీ రాజధాని అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని వెల్లడించారు. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమాల మాస్టర్ ప్లాన్లు మినహా అన్ని రాష్ట్రాల రాజధానుల మాస్టర్ ప్లాన్లను కేంద్రం ఆమోదించినట్లు వివరించారాయన.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా నిర్ణయించారు. ల్యాండ్ పూలింగ్ (రైతుల దగ్గరి నుంచి భూములు సేకరించి) చేసి రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం జరిగింది. ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని మారుస్తున్నాం అంటూ బిల్లులు కూడా తీసుకొచ్చింది. ఒకటి కాదు మూడు రాజధానులు అని ప్రకటన చేసింది. రాజధాని మారుస్తూ బిల్లు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుంది.

Also Read : తెలంగాణలో విజయం ఏపీ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వ్యూహ రచన

ఏపీ రాజధాని ఏది? అనే అంశంపై గతంలో అనేకసార్లు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇవాళ పార్లమెంటు వేదికగా మరోసారి ఏపీ రాజధాని అమరావతే అన్న విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ స్పష్టం చేశారు. దేశంలో చాలా రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది అవాస్తవం అని, మాస్టర్ ప్లాన్లతోనే రాజధానులు ఏర్పడుతున్నాయి, ఒక ప్రణాళిక బద్దంగానే రాష్ట్రాల రాజధానులు ఏర్పాటవుతున్నాయని, వాటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందన్నారు. ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కు సైతం కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ తెలిపింది.