AP Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. పలు బిల్లులు, పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం..!

అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు మంత్రివర్గం ఆమోదం తెల‌ప‌నుంది.

AP Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. పలు బిల్లులు, పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం..!

Updated On : March 16, 2025 / 11:55 PM IST

AP Cabinet Meeting : సోమవారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. స‌చివాలయంలో సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న‌ మంత్రివర్గం సమావేశ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఈ భేటీలో ఆమోదం తెలపనుంది.

అలాగే సీఆర్డీయే ఆమోదించిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం. దీంతో పాటుగా సీఆర్డీయే 22వేల 607 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 22 పనులకు ఆమోదం తెలపనుంది. అలాగే మున్సిపల్ శాఖలోని పలు అజెండాలకు ఆమోదం తెలపనుంది మంత్రి మండలి.

ఇంకా పలు కీలక అంశాలపై మంత్రి మండలిలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్ల టెండర్ల ప‌నులు చేప‌ట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. క్యాబినెట్ అమోదంతో టెండ‌ర్లు ద‌క్కించుకున్న సంస్థ‌ల‌కు లెట‌ర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయ‌నుంది సీఆర్డీఏ.

Also Read : ఆప్తులు కాస్త ప్రత్యర్థులుగా మారి జగన్‌పై బాణాలు.. వైసీపీ అధినేత టార్గెట్‌గా ఆ ఇద్దరి విమర్శల దాడి..

అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు మంత్రివర్గం ఆమోదం తెల‌ప‌నుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయిoపులకు అమోదం తెలపనుంది. మున్సిపల్ శాఖ లోని పలు ఎజెండాలకు, 4వ ఎస్ఐపిబి మీటింగ్ అమోదం తెలిపిన వాటికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 10 సంస్థల ద్వారా వచ్చే రూ. 1,21,659 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదించనుంది.

ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట రూ.1,742 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం. దాల్మియా సిమెంట్ సంస్థ‌ కడప జిల్లాలో రూ.2,883 కోట్ల పెట్టుబడులకు, లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ‌ విశాఖపట్నం న‌గ‌రంలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్వెష‌న్ సెంట‌ర్ ఏర్పాటుకు, సత్యవీడు రిజర్వ్ ఇన్ ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీసిటీలో రూ.25వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.58,469 కోట్ల పెట్టుబడులకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

* బాలాజీ యాక్షన్ బిల్డ్‌ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.1,175 కోట్లు పెట్టుబ‌డుల‌కు ఆమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్.
* ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమ్రిత్ లిమిటెడ్ కంపెనీ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో రూ.22వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్.
* ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నమయ్య, కడప జిల్లాల్లో రూ.8,240 కోట్లు పెట్టుబ‌డుల‌కు అమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్.
* మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్, కన్వెన్షన్ సంస్థ రూ.400 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్.

* ఒబెరాయ్ విలాస్ రిసార్ట్ రూ. 250 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్. ఈ పెట్టుబడుల ద్వారా 80వేల మందికి ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశం.
* 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు. ముందుగా 26 జిల్లాల్లో ఏర్పాటుకు ఆమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్.
* నెల రోజుల్లో రాష్ట్రంలో ఐదు చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి.
* అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ప‌లు బిల్లుల‌కు ఆమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్.