YCP Leaders Distribute Liquor : వైసీపీ నేతల నిర్వాకం .. గణేషుడి ఊరేగింపులో మద్యం పంపిణీ .. ఎగబడ్డ జనాలు

గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల నిర్వాకం బయటపడింది. అత్యంత పవిత్రంగా జరగాల్సిన గణేష్ నిమజ్జనం వేడుకల్లో వైసీపీ నేతలు మద్యాన్ని ఏరులై ప్రవహింపజేశారు. గణేషుడిని నిమజ్జనం చేయటానికి యాత్ర నిర్వహించగా ఆ యాత్రలో మద్యాన్ని పంపిణీ చేశారు. దీంతో ఆ యాత్రలో జనాలు ఎగబడి మరీ మద్యాన్ని తాగారు.

YCP Leaders Distribute Liquor : వైసీపీ నేతల నిర్వాకం .. గణేషుడి ఊరేగింపులో మద్యం పంపిణీ .. ఎగబడ్డ జనాలు

YCP leaders distributed liquor during Ganesh Yatra in Guntur

Updated On : September 6, 2022 / 4:37 PM IST

YCP Leaders Distribute Liquor : గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల నిర్వాకం బయటపడింది. అత్యంత పవిత్రంగా జరగాల్సిన గణేష్ నిమజ్జనం వేడుకల్లో వైసీపీ నేతలు మద్యాన్ని ఏరులైప్రవహింపజేశారు. గణేషుడిని నిమజ్జనం చేయటానికి యాత్ర నిర్వహించగా ఆ యాత్రలో మద్యాన్ని పంపిణీ చేశారు. దీంతో ఆ యాత్రలో జనాలు ఎగబడి మరీ మద్యాన్ని తాగారు. గణేష్ నిమజ్జనం వేడుల్లో భాగంగా గుంటూరులో వైసీపీ నేతల అత్యుత్సాహం విమర్శలకు దారి తీసింది. ఓ డ్రమ్ములో మద్యం నింపి ట్రక్కులో పెట్టారు. దాన్ని పంపిణీ చేయటంతో జనాలు భారీగా ఎగబడ్డారు. తాగినవారికి తాగినంత అంటూ పిలిచి మరీ మద్యం పంపిణీ చేశారు. సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ ఘనకార్యం జరగటం గమనించాల్సిన విషయం.

తాడేపల్లి గేటు సెంటర్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..పోలీసుల సమక్షంలోనే ఇలా గణేషుడి ఊరేగింపులో మద్యం పంపిణీ చేశారు. పోలీసులు చూసినా ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించారు. అదే ఏ సాధారణ వ్యక్తులో ఇదే పనిచేస్తే పోలీసులు అత్యుత్సాహం మామూలుగా ఉండకపోయేది. అర్జంటుగా అరెస్ట్ చేసి కేసులు బనాయించేవారని సాక్షాత్తు అధికార పక్ష నాయకులే ఇలా చేయటంతో పోలీసులు ఏమాత్రం పట్టనట్లుగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.