Gold Rate: బిగ్షాక్.. ఏపీ, తెలంగాణలో ఇవాళ బంగారం, వెండి ధరల వివరాలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.

Gold
Gold Rate: బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు మళ్లీ పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.490 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 450 పెరిగింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ఔన్స్ గోల్డ్ 12 డాలర్లు తగ్గి 3,329 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.89,950 కాగా.. 24 క్యారట్ల ధర రూ.98,130కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ.98,280కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 89,950 కాగా.. 24క్యారెట్ల ధర రూ.98,130కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,11,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,11,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.