Gold Rate Today: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు..

Gold
Gold Rate Today: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు మళ్లీ పెరిగింది. శనివారం తులం గోల్డ్ పై రూ.1500 పెరగ్గా.. ఇవాళ స్వల్పంగా పెరిగింది.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 50 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపైనా రూ.50 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. ఔన్సు గోల్డ్ పై రెండు డాలర్లు తగ్గి ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,362 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.92,950 చేరగా.. 24 క్యారట్ల ధర రూ.రూ.1,01,400కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,100కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,550కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.92,950 కాగా.. 24క్యారెట్ల ధర రూ.రూ.1,01,400కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,23,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,13,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,23,00 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.