బస్సు ట్యాంకర్ ఢీ : ఇద్దరు మృతి 15 మందికి గాయాలు

నల్గోండ: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాదుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు , ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ కు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.