ప్రేమించి, పెళ్ళికి నిరాకరిస్తున్నాడని యువతి సూసైడ్
మూడేళ్ళుగా ప్రేమించుకుంటూ పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ప్రియుడు దాట వేస్తుండటంతో ఒక మహిళ మనస్తాపంతో సూసైడ్ చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ప్రశాంత్ నగర్ కు చెందిన కళమ్మ అనే మహిళ ముగ్గురు కుమార్తెలతో జీవిస్తోంది. భర్త చాలా ఏళ్ల క్రితమే మరణించటంతో ఆమె పిల్లల్ని పెంచి పెద్ద చేసింది.
పెద్ద కుమార్తెకు పెళ్లి చేయగా మిగిలిన ఇద్దరు కూతుళ్లతో గ్రామంలో జీవిస్తోంది. సోమవారం, జూన్8 ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లిన రెండో కుమార్తె సుమలత(32) ఎంత సేపటికి తిరిగి రాలేదు. ఆమె ఆచూకి కోసం తల్లి ,చెల్లి గ్రామంలో గాలించగా ఒక పాడు పడిన ఇంట్లో దూలానికి ఉరి వేసుకునిసూసైడ్ చేసుకుంది.
వెంటనే వారు పోలీసులకు సమచారం ఇవ్వటంతో, ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం అమ్రాబాద్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. తనకూతురు ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తల్లి కళమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సుమలత అదే గ్రామానికి చెందిన ఒక యువకుడిని నాలుగేళ్లుగా ప్రేమిస్తోందని.. ఎన్నిసార్లు పెళ్లి ప్రస్తావని తెచ్చినా అతను దాట వేస్తున్నాడనే మనస్తాపంతోనే ఆత్మహత్యచేసుకుందని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ జరుపుతున్నారు.
Read: భార్య స్వదేశానికి వచ్చిన నెలరోజులకే.. దుబాయ్లో గుండెనొప్పితో భర్త మృతి