అసోంలో పేలుడు ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

అసోం : అసోం లోని గువాహటిలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు చనిపోగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. గువహాటి లో రద్దీ గా ఉండే జూ రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ వద్ద ఈ ఘటన సంభవించింది. గాయపడిన వారిని గువహాటి లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం దర్యాప్తు చేస్తున్నారు. గ్రెనేడ్ దాడి తామే చేసినట్లు యూనైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ప్రకటించుకుంది.
Assam: Six people injured in explosion outside a mall on Zoo road in Guwahati, area cordoned off, police present at the spot; injured persons referred to Guwahati Medical College Hospital pic.twitter.com/PotXVWsVFh
— ANI (@ANI) May 15, 2019