ఫుడ్ డెలివరీ డ్రైవర్లు : రోడ్ల మీద జరజాగ్రత్త!
హైదరాబాద్ లో ‘ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ’ చేసే స్విగ్గి, జోమాటో, ఉబర్ ఈట్స్ కంపెనీల వేకిల్ డ్రైవర్స్ ఇకపై జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా కంపెనీల వేకిల్ డ్రైవర్స్ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
![ఫుడ్ డెలివరీ డ్రైవర్లు : రోడ్ల మీద జరజాగ్రత్త! ఫుడ్ డెలివరీ డ్రైవర్లు : రోడ్ల మీద జరజాగ్రత్త!](https://10tv.in/wp-content/uploads/2019/01/food-delivery-hyderabad.jpg)
హైదరాబాద్ లో ‘ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ’ చేసే స్విగ్గి, జోమాటో, ఉబర్ ఈట్స్ కంపెనీల వేకిల్ డ్రైవర్స్ ఇకపై జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా కంపెనీల వేకిల్ డ్రైవర్స్ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
హైదరాబాద్ లో ‘ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ’ చేసే స్విగ్గి, జోమాటో, ఉబర్ ఈట్స్ కంపెనీల వేకిల్ డ్రైవర్స్ ఇకపై జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా కంపెనీల వేకిల్ డ్రైవర్స్ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందిన అధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన ఆదివారం ‘సెన్సిటైజేషన్ కమ్ సేఫ్టీ’ సమావేశం నిర్వహించారు. ఫుడ్ డెలివరీ వాహనాల ప్రమేయమున్న ప్రజల భద్రత, రోడ్డు భద్రత, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలపై జరిగిన ఈ సమావేశంలో ట్రాఫిక్, శాంతిభద్రతలు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
మద్యం తాగి వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ టాంపరింగ్ తదితర చర్యలతో ప్రజల్లో ఫుడ్ డెలివరీ డ్రైవర్స్ ఆందోళన కలిగిస్తున్నారు. మొదటిసారి కావడంతో ఇవి మీ దృష్టికి తీసుకొస్తున్నామని, తీరు మార్చుకోకపోతే ట్రాఫిక్ పాయింట్ సిస్టమ్తో కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిథులను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీలు ప్రవీణ్కుమార్, అమర్కాంత్ రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ భాస్కర్ పాల్గొన్నారు.