గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ రోగులకు రెండో వార్డ్‌ 

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణకిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. హైదరాబాద్‌ గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసింది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ రోగుల కోసం రెండో వార్డును అధికారులు సిద్ధం చేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 4, 2020 / 02:33 PM IST
గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ రోగులకు రెండో వార్డ్‌ 

Updated On : February 4, 2020 / 2:33 PM IST

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణకిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. హైదరాబాద్‌ గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసింది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ రోగుల కోసం రెండో వార్డును అధికారులు సిద్ధం చేస్తున్నారు.

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణకిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా నగరంలోని గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ రోగుల కోసం రెండో వార్డును అధికారులు సిద్ధం చేస్తున్నారు. పది మంది రోగులకు చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వైద్య విద్యా శాఖ డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాలేదున్నారు. అయినా అప్రమత్తంగా ఉన్నామని రమేశ్‌రెడ్డి తెలిపారు.
 
చైనా నుంచి రాష్ట్రానికి వస్తున్న వారికి ఎయిర్‌పోర్టులోనే పరీక్షలు నిర్వహించి అనుమానితులను ఆయా ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు. గత నెల 25 నుంచి ఫిబ్రవరి 2వతేదీ వరకు ఫీవర్‌ ఆస్పత్రికి 18మంది అనుమానితులు పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల చైనా నుంచి వచ్చినవారు కరోనా వైరస్‌ నేపథ్యంలో అనుమానంతో మాత్రమే నిర్ధారణ పరీక్షల కోసం ఫీవర్‌ ఆస్పత్రికి వస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
 
ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో కరోనా అనుమానిత కేసులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కోన్నారు. మాస్క్‌లతోపాటు డిస్పోజబుల్‌ డ్రస్సులు కూడా అందుబాటులో ఉంచామన్నారు. కరోనా వైరస్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, ఈకారణంగా వైద్య సిబ్బందిని తప్ప ఇతరులెవరిని ఆ వార్డులోకి అనుమతించడం లేదని అస్పత్రి అధికారులు చెప్పతున్నారు.

ఇటీవల చైనా నుంచి కేరళ వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికారులు వెల్లడించారు. అతని బ్లడ్ శాంపిల్స్ పరీక్షల కోసం పంపారు. పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. వుహాన్‌ యూనివర్సిటీ నుంచి కేరళకు వచ్చిన ఆ విద్యార్థికి కరోనా వైరస్‌ సోకినట్టు అనుమానం రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.