COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,139 కరోనా కేసులు నమోదు
దేశంలో కొత్తగా 2,139 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 3,208 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు 4,40,63,406 ఉన్నాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.81 శాతంగా ఉందని, వారాంతపు పాజిటివిటీ రేటు 1.13 శాతం ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 26,292 మంది చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది.

Corona virus
COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,139 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 3,208 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు 4,40,63,406 ఉన్నాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.81 శాతంగా ఉందని, వారాంతపు పాజిటివిటీ రేటు 1.13 శాతం ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 26,292 మంది చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 219.09 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు తెలిపింది. వాటిలో రెండో డోసులు 94.92 కోట్లు, బూస్టర్ డోసులు 21.67 కోట్లు ఉన్నట్లు చెప్పింది. నిన్న దేశంలో 4,93,352 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు 89.76 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. నిన్న 2,64,216 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..