COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,797 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 2,797 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 3,884 మంది కోలుకున్నట్లు వివరించింది. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,51,228కి చేరిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 29,251గా ఉందని తెలిపింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.75 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,797 కరోనా కేసులు నమోదు

Corona

Updated On : October 8, 2022 / 10:41 AM IST

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,797 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 3,884 మంది కోలుకున్నట్లు వివరించింది. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,51,228కి చేరిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 29,251గా ఉందని తెలిపింది.

రికవరీ రేటు ప్రస్తుతం 98.75 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.05 శాతం ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.30 శాతంగా ఉన్నట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు 89.67 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది. అలాగే, నిన్న 2,66,839 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

దేశంలో ఇప్పటివరకు వాడిన కరోనా వ్యాక్సిన డోసుల సంఖ్య 218.93 కోట్లకు చేరిందని చెప్పింది. వాటిలో రెండో డోసుల సంఖ్య 94.89 కోట్లుగా ఉందని పేర్కొంది. బూస్టర్ డోసుల సంఖ్య 21.54 కోట్లుగా ఉందని వివరించింది. నిన్న దేశంలో 4,96,833 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..