డేట్ కూడా చెప్పేశాడు : పాక్ పై మరో దాడికి భారత్ రెడీ!

పాకిస్తాన్ పై మరోసారి దాడి చేయాలని భారత్ ఫ్లాన్ చేస్తోందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ అన్నారు.నమ్మకమైన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈమేరకు తమ ప్రభుత్వానికి సమాచారమందిందని ఆయన తెలిపారు.
ఆదివారం(ఏప్రిల్-7,2019)ముల్తాన్ లో మీడియా సమావేశంలో ఖురేషీ మాట్లాడుతూ…పాక్ పై భారత్ కొత్త దాడికి పథకం రచిస్తోందన్నారు.తమకు అందిన సమచారం మేరకు ఏప్రిల్ 16-20వ తేదీ మధ్యలో ఆ దాడి జరిగే అవకాశముందని అన్నారు. భారత్ లోని అధికార పార్టీ యుద్ధం కోసం తపిస్తోందని అన్నారు. ఈ విషయాన్ని తాము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలకు తెలిపినట్లు చెప్పారు. కేవలం పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ అనుమతితో ఈ విషయాన్ని దేశప్రజలకు వెల్లడించానని తెలిపారు.