Anand Mahindra : సునీతా విలియమ్స్ని లిఫ్ట్ అడిగిన ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ప్రత్యేక విందు తర్వాత ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీలు సునీతా విలియమ్స్ని స్పేస్ షిప్లో లిఫ్ట్ ఇస్తారా? అని అడిగారట. తమ మధ్య జరిగిన సరదా సంభాషణను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.

Anand Mahindra
Anand Mahindra : ప్రధాని మోదీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందులో ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీ, బృందా కపూర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. విందు తర్వాత వైట్ హౌస్లో ‘ఇండియా-యుఎస్ హై-టెక్ హ్యాండ్షేక్’ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంలో జరిగి ఓ సరదా సంఘటనను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు.
Anand Mahindra : ఇలాంటి అద్భుతాన్ని భారత్లో చేయగలమా? : మంత్రి గడ్కరికీ ఆనంద్ మహీంద్రా ప్రశ్న
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ప్రత్యేక విందులో 380 మంది విశిష్ఠ అతిథులు పాల్గొన్నారు. విందు తరువాత వైట్ హౌస్లో ఇండియా-యూఎస్ హైటెక్ హ్యాండ్షేక్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ ఈవెంట్కు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆనంద్ మహీంద్రా, బృందా కపూర్, ముఖేష్ అంబానీ, యుఎస్ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోతో మాటల్లో మునిగిపోయారట.
దీని ఫలితంగా లంచ్ ఎంగేజ్మెంట్కు తీసుకెళ్లాల్సిన గ్రూప్ షటిల్ బస్సును మిస్ అయ్యారట. ఓ వైపు ఉబర్కి కాల్ చేస్తూ మరోవైపు నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్తో సెల్పీ కోసం పరుగులు తీశారట. విలియమ్స్ను స్పేస్ షిప్లో లిఫ్ట్ ఇస్తారా? అని సరదాగా అడిగారట.. సునీతా విలియమ్స్తో దిగిన ఫోటోతో పాటు .. ఈ మధుర క్షణాల్ని తన ట్వీట్లో ఆనంద్ మహీంద్రా షేర్ చేసుకున్నారు. ఆయన చేసిన ట్వీట్పై చాలామంది స్పందించారు.
‘పవర్ ఫుల్ సెల్ఫీ ఆనంద్ జీ’ అని ఒకరు.. ‘భారతదేశపు ప్రముఖులతో ప్రయాణించడం ఉబెర్కు ఎంతో గౌరవం’ అంటూ మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు.
I suppose this was what they would call a ‘Washington moment.’ After the tech handshake meeting yesterday, Mukesh Ambani, Vrinda Kapoor & I were continuing a conversation with the Secretary of Commerce & missed the group shuttle bus to the next lunch engagement. We were trying… pic.twitter.com/gP1pZl9VcI
— anand mahindra (@anandmahindra) June 25, 2023