బాలు గారు త్వరగా కోలుకోవాలి..

  • Published By: sekhar ,Published On : August 17, 2020 / 02:08 PM IST
బాలు గారు త్వరగా కోలుకోవాలి..

గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇటీవ‌ల‌ కరోనా వైర‌స్ సోక‌డంతో చెన్నైలో ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి కాస్త విష‌మించ‌డంతో ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకుంటున్నార‌ని ఆయ‌న త‌న‌యుడు ఎస్పీ చ‌ర‌ణ్ తెలియ‌జేశారు. ఇళయరాజా, క‌మ‌ల్‌హాస‌న్‌, చిరంజీవి, ఖుష్బూ, పవన్ కళ్యాణ్ స‌హా ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు SPB కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ ట్విట్ట‌ర్ ద్వారా బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



‘‘ఐదు ద‌శాబ్దాల‌కు పైగా భార‌తదేశంలోని ప‌లు భాష‌ల్లో త‌న అద్భుత‌మైన గాత్రంతో ఎన్నో వేల పాట‌లు పాడి కోట్లాది మంది అభిమానుల‌ను అల‌రించిన బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గారు ఇప్పుడు క‌రోనా వైర‌స్ కార‌ణంగా హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ భ‌గవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అంటూ వీడియోలో పేర్కొన్నారు ర‌జినీకాంత్‌. అలాగే సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కూడా బాలు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.





‘‘స్నేహితుడా, ఆత్మీయుడా.. బాలు నువ్వు ఆయురారోగ్యాలతో అతి తొందరలో ఇంటికి రావాలని, తొందరలో మన ఇంస్టిట్యూషన్స్ కు వచ్చి అద్భుతంగా మంచి పాట పాడాలని, సినిమాల్లో పాటలు పాడాలని ఆ షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశ్శీసులు నీకు ఎప్పుడు ఉన్నాయి’’.. అంటూ మోహన్ బాబు ఆకాంక్షించారు.