CAAపై మన్మోహన్ వ్యాఖ్యలు…వీడియో బయటపెట్టిన బీజేపీ

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొద్దిరోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్,తృణముల్,సీపీఐ(ఎం)వంటి పలు పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పలుచోట్ల ఆయా పార్టీ నాయకులు సైతం ఆందోళనల్లో పాల్గొంటున్న సమయంలో ఇవాళ(డిసెంబర్-19,2019)బీజేపీ కాంగ్రెస్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.
2003లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో మాట్లాడిన వీడియోను బీజేపీ విడుదల చేసింది. ఆ వీడియోలో మన్మోహన్ సింగ్…పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లోని మైనార్టీలు వేధింపులను ఎదుర్కొంటున్నారని, వాళ్లు భారత పౌరసత్వం కోరుకుంటున్నారని, వారికి పౌరసత్వం కల్పించే అంశాన్నిపరిశీలించాలని అప్పటి ఉప ప్రధాని ఎల్ కే అద్వాణీని రాజ్యసభలో మన్మోహన్ కోరారు.
ఈ వీడియోను గురువారం బీజేపీ తన ట్విట్టర్ లో షేర్ చేసింది. మూడు దేశాల మైనార్టీల పట్ల ఔదార్యంతో వ్యహరించాలని మన్మోహన్ రాజ్యసభలో కోరిన ఆ వీడియోపై ఇంకా కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు మన్మోహన్ పాత వీడియోను పోస్టు చేసింది.
In 2003, speaking in Rajya Sabha, Dr Manmohan Singh, then Leader of Opposition, asked for a liberal approach to granting citizenship to minorities, who are facing persecution, in neighbouring countries such as Bangladesh and Pakistan. Citizenship Amendment Act does just that… pic.twitter.com/7BOJJMdkKa
— BJP (@BJP4India) December 19, 2019