Cabinet Expansion: మోడీ క్యాబినెట్‌లో తెలంగాణకు మరొక బెర్త్!

ప్రధాని నరేంద్ర మోడీ నేడు (7-7-21) తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.

Cabinet Expansion: మోడీ క్యాబినెట్‌లో తెలంగాణకు మరొక బెర్త్!

Cabinet Expansion

Updated On : July 7, 2021 / 8:51 AM IST

Cabinet Expansion: ప్రధాని నరేంద్ర మోడీ నేడు (7-7-21) తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ప్రస్తుతం 53 మందితో మోడీ మంత్రి వర్గం ఉండగా కొత్తగా తన మంత్రివర్గంలోకి మరో 28 మందికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు.

అయితే ఈసారి తెలంగాణకు చెందిన మరో ఎంపీకి ఛాన్స్ దక్కుతుందని స్థానిక బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు పేరును ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేతలు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండగా తెలంగాణ నుంచి రెండో వ్యక్తిగా బాపూరావుకు అవకాశం కల్పించనున్నట్లుగా తెలుస్తుంది.

గిరిజన వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్న అర్జున్ ముండాతో పాటు సహాయ మంత్రి రేణుక సింగ్ సరుటను మంత్రివర్గం నుంచి తొలగించి.. ఎన్డీయే-1లో గిరిజన వ్యవహారాల మంత్రిగా పనిచేసిన జ్యుయల్ ఓరమ్‌కు మళ్లీ తిరిగి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉండగా సహాయ మంత్రిగా తెలంగాణకు చెందిన గిరిజన, ఆదివాసీ నేత సోయం బాపూరావుకు చోటు కల్పించనున్నట్టు తెలుస్తుంది. ఇక కిషన్ రెడ్డికి సహాయ మంత్రి నుంచి స్వతంత్ర హోదా కలిగిన సహాయమంత్రిగా పదోన్నతి కల్పించనున్నట్లు చెప్తున్నారు.