రాజ్యసభ సెక్రటేరియెట్ లో డైరెక్టర్ కు కరోనా ..పార్లమెంట్ లోని రెండు అంతస్తులు సీజ్

కరోనా మహమ్మారి భారత్ లో విలయతాండవం చేస్తోంది. ఢిల్లీలోని రాజ్యసభ సెక్రటేరియెట్ లో డైరెక్టర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పార్లమెంట్ బిల్డింగ్ లోని రెండు అంతస్తులను సీజ్ చేశారు. అధికారితోపాటు ఆయన భార్య, పిల్లలకు కూడా కరోనా వైరస్ సోకినట్లు తేలింది.
ఈ నేపథ్యంలో పార్లమెంట్ హౌజ్ లోని మొదటి అంతస్తును శానిటైజ్ చేసి సీల్ చేశారు. అయితే ఆ అధికారితో టచ్ లోకి వచ్చిన ప్రతి ఒక్క అధికారి, వ్యక్తిగత సిబ్బంది కూడా తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అధికారులు ఆదేశించారు. మరోవైపు గత 24 గంటల్లో భారత్ లో 7 వేల 466 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తొలిసారి దేశంలో ఒకేరోజు ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. భారత్ లోని కరోనా కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 1.65 లక్షలకు చేరుకుంది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 2 వేల 190కేసులు నమోదయ్యాయి.
కరోనాకు సంబంధించిన మృతుల సంఖ్య 4 వేల 706 చేరుకుంది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి 71 వేల 105 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 175 మృతి చెందగా దేశంలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 89 వేల 987గా ఉంది.
Read: INDIAలోని ఆ గ్రామంలో భార్యలను అద్దెకిస్తారు… అదే సాంప్రదాయమట