Cyber Fraud : సైబర్ నేరగాళ్ల ఘరాన మోసం.. ఏకంగా రిటైర్డ్ ఆర్మీ అధికారి నుంచి రూ. 3 లక్షలు కొట్టేశారు
అతడి ఫోన్ కాల్ న్యూయార్క్ నంబర్ ను సూచించడంతో బాధితుడు నిజమేనని నమ్మాడు. తాను త్వరలోనే భారత్ కు వస్తున్నానని అక్కడికి వచ్చే ముందు మీ బ్యాంకు ఖాతాలో కొంత మొత్తం జమ చేస్తానని చెబుతూ బ్యాంక్ ఖాతా వివరాలు రాబట్టుకున్నాడు.

Cyber Fraud
Cyber Fraud – Retired Army Officer : సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పుడతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల ఘరాన మోసం వెలుగుచూసింది. ఏకంగా రిటైర్డ్ ఆర్మీ అధికారి నుంచి రూ.3 లక్షలు కొట్టేశారు. అమెరికాలోని బంధువులమని చెబుతూ స్కామర్లు మోసం చేశారు. బాధితుడిని కర్ణాటకలోని బిల్లిమరనహళ్లికి చెందిన కెప్టెన్ రిటైర్డ్ రంజిత్ సింగ్ గా గుర్తించారు. ఆగస్టు17న సింగ్ కు కాల్ చేసిన నిందితుడు తాను సుఖ్విందర్ సింగ్ నని, బాధితుడి బంధువునని నమ్మంచాడు.
అతడి ఫోన్ కాల్ న్యూయార్క్ నంబర్ ను సూచించడంతో బాధితుడు నిజమేనని నమ్మాడు. తాను త్వరలోనే భారత్ కు వస్తున్నానని అక్కడికి వచ్చే ముందు మీ బ్యాంకు ఖాతాలో కొంత మొత్తం జమ చేస్తానని చెబుతూ బ్యాంక్ ఖాతా వివరాలు రాబట్టుకున్నాడు. ఆపై కొద్ది సేపటికే సింగ్ ఖతాలో రూ.25 లక్షలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఎస్బీఐ ఎగ్జిక్యూటివ్ అంటూ కెప్టెన్ సింగ్ కు వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
Cyber Fraud : ఎన్టీఆర్ జిల్లాలో భారీ సైబర్ మోసం.. అకౌంట్ల నుంచి రూ.3 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
24 గంటల తర్వాత ఈ మొత్తం మీ ఖాతాలో కనిపిస్తుందన్నారు. కెప్టెన్ సింగ్ కు మరోసారి విదేశీ నంబర్ నుంచి కాల్ చేసిన నిందితుడు పాస్ పోర్ట్ సమస్యల కారణంగా రూ.5 లక్షలు తాను చెప్పిన ట్రావెల్ ఏజెంట్ ఖాతాకు బదిలీ చేయాలని ఆ మొత్తాన్ని తాను పంపిన రూ.25 లక్షల నుంచి మినహాయించుకోవాలని కోరాడు.
రూ.3లక్షలను కెప్టెన్ సింగ్ సర్దుబాటు చేయడంతో మిగిలిన రూ.2 లక్షల కోసం నిందితుడు ఒత్తిడి చేశాడు. అనుమానం వచ్చిన సింగ్ విదేశాల్లోని తన బంధువు సుఖ్విందర్ సింగ్ కు ఫోన్ చేయగా తాను అసలు కెప్టెన్ సింగ్ కు కాల్ చేయలేదని చెప్పడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.