ఫూంచ్‌ సెక్టార్‌లో కాల్పులు: ముగ్గురు పాక్ సైనికులు మృతి

భారత్ - పాక్ సరిహద్దుల్లోమరోసారి తుపాకులు ఘర్జించాయి. ఫూంచ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 08:07 AM IST
ఫూంచ్‌ సెక్టార్‌లో కాల్పులు: ముగ్గురు పాక్ సైనికులు మృతి

Updated On : April 2, 2019 / 8:07 AM IST

భారత్ – పాక్ సరిహద్దుల్లోమరోసారి తుపాకులు ఘర్జించాయి. ఫూంచ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.

ఢిల్లీ : భారత్ – పాక్ సరిహద్దుల్లోమరోసారి తుపాకులు ఘర్జించాయి. ఫూంచ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఈ క్రమంలో భారత భద్రతా బలగాలు, పాకిస్థాన్‌ సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు పాకిస్థాన్‌ సైనికులు మృతి చెందారని పాక్‌ సైనికులు ముగ్గురు మృతి చెందారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇండియన్‌ ఆర్మీ తెలిపింది.  దీనికి సంబంధించి పాకిస్థాన్‌ ఆర్మీ దళాలు పత్రికా ప్రకటన విడుదల చేశాయి.
Read Also : హార్థిక్ పటేల్ అంత తొందరెందుకు ?

మోర్టార్‌ షెల్స్‌తో పాక్‌ రేంజర్లు దాడి చేయగా.. భారత సైన్యం ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే ముగ్గురు పాక్‌ సైనికులు మృతి చెందారు. కాగా సోమవారం  (ఏప్రిల్ 1)న  పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also : Fans Upset : అవెంజర్స్.. ఎండ్ గేమ్ : రెహమాన్ ‘మార్వెల్’సాంగ్ రిలీజ్