Mumbai : ట్రైన్‌లో యువతితో స్టెప్పులేసిన పోలీస్.. సీరియస్ అయిన అధికారులు

విధుల్లో ఉన్న ఓ పోలీసు బాధ్యతను విస్మరించాడు. యువతితో కలిసి కదులుతున్న ట్రైన్‌లో స్టెప్పులు వేసాడు. ఫలితం ఏమైందో చదవండి.

Mumbai : ట్రైన్‌లో యువతితో స్టెప్పులేసిన పోలీస్.. సీరియస్ అయిన అధికారులు

Mumbai

Updated On : December 13, 2023 / 6:18 PM IST

Mumbai : ముంబయిలో ఓ పోలీసు అధికారి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదులుతున్న ట్రైన్‌‌లో ఓ యువతితో  హోంగార్డు SF గుప్తా స్టెప్పులేసిన వీడియో బయటకు రావడంతో అధికారులు సీరియస్ అయ్యారు.

Naatu Naatu : నాటు నాటు స్టెప్ వేసిన అవెంజర్స్ స్టార్ లోకి.. పిక్ వైరల్

saiba__19 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో కదులుతున్న ట్రైన్‌లో ఓ యువతి స్టెప్పులు వేయడం ప్రారంభించింది. ఆమెను హెచ్చరించాల్సిన పోలీసు సైతం స్టెప్పులు వేయడం ప్రారంభించారు. ముంబయి సెంట్రల్ రైల్వే లోకల్ ట్రైన్ సెకండ్ క్లాస్ లేడీస్ కోచ్‌లో డిసెంబర్ 6 న ఈ ఘటన జరిగింది. అప్పుడు సమయం రాత్రి పది గంటలుగా తెలుస్తోంది. ఆ సమయంలో మహిళల భద్రత కోసం కేటాయించబడిన హోంగార్డు గుప్తా విధుల్లో ఉండి ఇలా ప్రవర్తించడం విమర్శలకు దారి తీసింది.

Anushka And Virat Kohli : కోహ్లీ, అనుష్కల వివాహ వార్షికోత్సవ ఫొటోలు వైరల్.. అనుష్కశర్మ ఏమన్నదంటే?

గుప్తా డ్యాన్స్ చేస్తున్న వీడియో  డివిజనల్ రైల్వే మేనేజర్ అధికారిక ఖాతా నుండి  RPF కు ట్యాగ్ చేశారు. RPF దీనిని గుర్తించడంతో విషయం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై స్పందించిన రైల్వే పోలీసులు (GRP) డిసెంబర్ 8 న గుప్తాను వివరణ కోరుతూ నోటీసు పంపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామంటూ రైల్వే పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇతరుల్ని హెచ్చరించాల్సిన పోలీసు కాస్తా బాధ్యత మరచి చిక్కులు కొని తెచ్చుకున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by ♥️??i??…..♥️ (@saiba__19)