Bangladesh Woman : భర్తను, కొడుకును వదిలేసి,ప్రియుడి కోసం భారత్‌ వచ్చేసిన బంగ్లాదేశ్ మహిళ .. కట్ చేస్తే ఏం జరిగిందంటే..?

ప్రేమ ఎవరిమీద ఎప్పుడు ఎలా పుడుతుంతో తెలీదు. కొంతకాలంగా ప్రేమ పేరుతో వివాహాలు అయినవారు వారి కుటుంబాలను కూడా వదిలేసి ఏకంగా దేశ సరిహద్దులు దాటుతున్న ఘటనలు జరుగుతున్నాయి.

Bangladesh Woman : భర్తను, కొడుకును వదిలేసి,ప్రియుడి కోసం భారత్‌ వచ్చేసిన బంగ్లాదేశ్ మహిళ .. కట్ చేస్తే ఏం జరిగిందంటే..?

Bangladesh married woman came to India

Bangladesh married woman came to India : ప్రేమ ఎవరిమీద ఎప్పుడు ఎలా పుడుతుంతో తెలీదు. ప్రేమ దేశ సరిహద్దుల్ని కూడా దాటించేస్తోంది. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వివాహాలు అయినవారు వారి కుటుంబాలను కూడా వదిలేసి ఏకంగా దేశ సరిహద్దులు దాటుతున్న ఘటనలు జరుగుతున్నాయి. దాయాది దేశాల మధ్య కూడా ప్రేమ పేరుతో దేశ సరిహద్దులు దాటిన వైనాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అటుబంగ్లాదేశ్ నుంచి కూడా భారత్ కు వచ్చిన ఓ మహిళ యూపీలోని వ్యక్తితో కలిసి ఉండటం వంటి పలు ఆసక్తికర ఘటనలు అంతర్జాతీయ ప్రేమలకు సాక్ష్యాలుగా నిలిచాయి.

ఈక్రమంలో మరో ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళ తన భర్త, కుమారుడ్ని వదిలేసి ప్రియుడి కోసం దేశ సరిహద్దులు దాటి భారత్ వచ్చేసింది. బంగ్లాదేశ్ కు తరచుగా వెళ్లే భారత్ కు చెందిన ఓ డాక్టర్ తో బంగ్లా మహిళకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో భర్త, కుమారుడ్ని కూడా వదిలేసి భారత్ వచ్చేసింది. సాధారణంగా మహిళలు తమ భర్తలతో విభేధాలు వచ్చినా కడుపున పుట్టిన బిడ్డల్ని వదులుకోవానికి ఇష్టపడరు. కానీ ఇటీవల ప్రేమ కోసం కన్నబిడ్డలను సైతం వదిలేసి దేశ సరిహద్దులు దాటేస్తున్న మహిళ కథా కమామీషులు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. అటువంటిదే ఈ బంగ్లాదేశ్ మహిళ కథ..ఈ కథలో కొన్ని ట్విస్టులు కూడా చోటుచేసుకోవటం విశేషం.

Assam Govt : రెండో పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి : ఉద్యోగులకు సీఎం వార్నింగ్

త్రిపురకు చెందిన నూర్ జలాల్ అనే 34 ఏళ్ల వ్యక్తి ఆయుర్వేదం డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అతను తరచు బంగ్లాదేశ్ కు వెళ్లి వస్తుండేవాడు. అక్కడి మౌల్వీ బజార్ కు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి బంగ్లాదేశ్ కు చెందిన ఫతేమా నుస్రత్ అనే 24 ఏళ్ల మహిళతో పరిచయం అయ్యింది. వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ ప్రేమ మైకంలో మునిగి భర్తను..కుమారుడ్ని వదిలేసి అక్రమంగా దేశ సరిహద్దులు తాటి భారత్ లోకి అడుగు పెట్టింది. డాక్టర్ ప్రియుడు ఉండే ఉత్తర త్రిపురలోని ధర్మనగర్ ఫుల్ బరీకి వచ్చేసింది. నూర్ కు వివాహం కాలేదు. దీంతో డాక్టర్ నూర్ ను వివాహం చేసుకునేందుకు భారత్ వచ్చేసింది. అతనితోనే కలిసి ఉంటోంది. ఈ విషయంపై సమచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

అనుమతి లేకుండా భారత్ వచ్చిన ఇక్కడే నివసిస్తున్న ఫతేమాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ధర్మాసనం ఫతేమాకు 14 రోజలపాటు జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఆమెను పెళ్లి చేసుకున్న ఆయుర్వేద వైద్యుడు నూర్ కనిపించకుండాపోయాడు. దీంతో పరారీలో ఉన్న నూర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.