IND vs SA 2nd Test: సౌతాఫ్రికా టార్గెట్ 240
జోహన్నెస్బర్గ్లోని వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు భారత జట్టు రెండో ఇన్నింగ్స్ను 266 పరుగులకు ముగించింది.

IND vs SA 2nd Test
IND vs SA 2nd Test: జోహన్నెస్బర్గ్లోని వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు భారత జట్టు రెండో ఇన్నింగ్స్ను 266 పరుగులకు ముగించింది. తొలి ఇన్నింగ్స్లో 27 పరుగుల ఆధిక్యంతో ఆతిథ్య జట్టుకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే హాఫ్ సెంచరీలు సాధించారు.
పుజారా 86 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. అదే సమయంలో రహానే 78 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 58 పరుగులు చేశాడు. మరోవైపు హనుమ విహారి 84 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా తరఫున మార్కో జాన్సెన్, లుంగీ ఎన్గిడి, కగిసో రబాడ చక్కటి బౌలింగ్ చేశారు. వీరంతా తలా మూడు వికెట్లు తీశారు. అదే సమయంలో, డువాన్ ఆలివర్ ఒక్క వికెట్ తీసుకున్నాడు.
శార్దూల్ ఠాకూర్ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్:
లోయర్ ఆర్డర్లో బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ 28 పరుగులతో బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. అదే సమయంలో రిషబ్ పంత్ సున్నాతో పెవిలియన్ చేరుకున్నాడు. అశ్విన్ 16, జస్ప్రీత్ బుమ్రా ఏడు పరుగులు చేశారు. మహ్మద్ సిరాజ్ రూపంలో భారత్ చివరి వికెట్ కోల్పోయింది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ భారత జట్టు 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనికి సమాధానంగా ఆతిథ్య జట్టు 229 పరుగులు చేసి 27పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సిరీస్లో నిలవాలంటే దక్షిణాఫ్రికా 240పరుగులు చేయాలి. మూడు టెస్టుల సిరీస్లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది.
Innings Break!#TeamIndia all out for 266 (Pujara 53, Ajinkya 58) in the second innings. Set a target of 240 for South Africa.
Scorecard – https://t.co/qcQcovZ41s #SAvIND pic.twitter.com/Z2RGn6zTlC
— BCCI (@BCCI) January 5, 2022