Bandi Sanjay : కరీంనగర్‌ ఫలితం, ఎగ్జిట్ పోల్స్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అందరి సహకారంతో కరీంనగర్ లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో ఒకవేళ హంగ్ వస్తే ఎవరికి మద్దతివ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు బండి సంజయ్.

Bandi Sanjay : కరీంనగర్‌ ఫలితం, ఎగ్జిట్ పోల్స్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay (Photo : Facebook)

కరీంనగర్ లో గెలుపు ఎవరిదో చెప్పేశారు బండి సంజయ్. కరీంనగర్ లో భారీ మెజారిటీతో బీజేపీ గెలవబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ గెలుపులో బీజేపీ కార్యకర్తలు అసలైన హీరోలు అని అన్నారు. నెల రోజుల పాటు బీజేపీ గెలుపు కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. అటు ఎగ్జిట్ పోల్స్ పైనా బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ చాలాసార్లు పొరబడ్డాయని అన్నారు. దుబ్బాక , GHMC ఎన్నికల్లోనూ అదే జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒకవేళ హంగ్ వస్తే ఎవరికి మద్దతివ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు బండి సంజయ్.

” ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి, పోలీసు సిబ్బంది హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరి సహకారంతో కరీంనగర్ లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా రెచ్చిపోవద్దని మా కార్యకర్తలకు ముందే చెప్పాం. మందకృష్ణ మాదిగకు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీదే గెలుపు. మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. పక్కా గెలుస్తాం.

Also Read : తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..! ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాలు

ఎగ్జిట్ పోల్స్ ఎవరికి వారు చెప్పుకుంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఐదే గెలుస్తాయన్నారు. దుబ్బాకలోనూ బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. అనేక సందర్భాల్లో అనేకసార్లు ఎగ్జిట్ పోల్స్ తారుమారు అయ్యాయి. మేము గెలుస్తామని పూర్తి విశ్వాసం ఉంది” అని బండి సంజయ్ అన్నారు.

Also Read : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు