Indiramma Atmiya Bharosa: గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఫండ్స్ రిలీజ్.. ఈ జిల్లాల్లో లబ్ధిదారులకు అకౌంట్లో రూ.6వేలు పడ్డాయ్..
డబ్బులు రావడంతో తెలంగాణలోని వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలోని వ్యవసాయ కూలీలకు గుడ్న్యూస్. ఉపాధి కూలీలకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోలేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ అయ్యాయి.
జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులు జమ చేసింది ప్రభుత్వం. మొత్తం 18,180 మందికి రూ.6 వేల చొప్పున జమ అయ్యాయి.
Also Read: ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు.. పూర్తి వివరాలు ఇదిగో..
ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేచేశారు.
దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదలయ్యాయి. ఆ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం చెల్లించింది. 66,640 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు జమ అయ్యాయి.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించనున్నారు. డబ్బులు రావడంతో తెలంగాణలోని వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.