Telangana Govt : మహిళలకు గుడ్న్యూస్.. ఈసారి ముందుగానే రేవంత్ సర్కార్ దసరా కానుక.. మారిన చీరల రంగు
Telangana Govt Sarees : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో దసరా పండుగ వస్తుండటంతో.. ముందుగానే మహిళలకు చీరలు పంపిణీ చేయనుంది.
Telangana Govt Sarees
Telangana Govt Sarees : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతీయేటా బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా ప్రభుత్వం మహిళలకు చీరలను అందించనుంది. అయితే, ఈసారి ముందుగానే మహిళ చేతికి చీరలు చేరనున్నాయి.
Also Read : Telangana Govt : రైతులకు పండుగలాంటి వార్త.. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం! 7 రకాలకు రూ.500 బోనస్
రాష్ట్రంలో ఇందిరా మహిళాశక్తి పథకం కింద మహిళలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్న చీరలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ నెలలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని మహిళలకు చీరలను అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 95లక్షల చీరల్లో 30లక్షల చీరలు తయారీ పూర్తికాగా.. వాటిని జిల్లాలకు చేరవేస్తున్నారు. రూ. 334 కోట్లతో చీరల తయారీని ప్రభుత్వం చేపట్టింది.
మహిళలకు ఈసారి చీరలను ముందుగానే అందజేయనున్నారు. గతేడాది ఇందిరాగాంధీ జయంతి రోజైన నవంబరు 19వ తేదీన పంపిణీ చేపట్టగా.. ఈసారి ముందుగా చీరలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే అక్టోబర్ 11న జరిగే బతుకమ్మ పండుగకు పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో పాలపిట్ట రంగు చీరలు ఉండగా.. ఈసారి చిలకపచ్చ రంగును ఎంపిక చేశారు. ప్రతీ మహిళకు ఉచితంగా రెండు చీరలను అందించనున్నారు. ఈసారి నాణ్యత, ప్యాకింగ్ లో ప్రభుత్వం ప్రత్యేక శద్ద తీసుకుంటోంది. చీరల పంపిణీకి ప్రభుత్వం నుంచి తేదీ ఖరారు కాగానే.. స్థానిక యంత్రాంగం వీటిని మహిళలకు అందించనుంది.
