Telangana Corona Cases : తెలంగాణలో కరోనా తగ్గుముఖం
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,061 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,79,971కి చేరింది.

Telangana Corona Cases
Telangana Corona Cases : తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,061 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,79,971కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 4,102కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 3,590 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,470 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 274 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 69,892 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. సోమవారంతో(1,380) పోలిస్తే మంగళవారం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.
Safer Internet Day 2022: ఆన్లైన్లో మీ పిల్లలు జాగ్రత్త.. సేఫ్గా ఉంచేందుకు 5మార్గాలు ఇవే!
మరోవైపు దేశంలోనూ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. భారత్కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికి అనుగుణంగా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. జనవరి మధ్యలో అత్యధిక కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు క్రమంగా మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తే.. ఇవాళ ఆ సంఖ్య 70 వేల దిగువకు పడిపోయింది. ఇదే సమయంలో.. మృతుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగించే విషయం.
Snacks : చిరుతిళ్లతో రోజంతా గడిపేస్తున్నారా?…
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 67వేల 597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మృతుల సంఖ్య వెయ్యికి పైగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 1,188 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,02,874కు పెరిగింది. భారత్లో ప్రస్తుతం 9,94,891 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు ఇప్పటివరకు దేశ్యాప్తంగా 170 కోట్లకు పైగా (1,70,21,72,615) డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా రోజువారి పాజిటివిటీ రేటు 5.02 శాతానికి దిగివచ్చింది. కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టినా.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.08.02.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/EAG6F1r08V— IPRDepartment (@IPRTelangana) February 8, 2022