సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్లు సహయం..భార్యకు గ్రూప్ 1 జాబ్ ..కేసీఆర్

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సంతోష్బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్ల ఎక్స్గ్రేషియాతోపాటు నివాసస్థలం, సంతోష్ భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
తాను స్వయంగా సంతోష్బాబు ఇంటికి వెళ్లి సాయం అందిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇదే ఘర్షణలో మరణించిన 19 మంది సైనికుల కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ. 10లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామన్నారు.
సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనికుల్లో ఆత్మవిశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి. దేశమంతా మీ వెంటనే ఉందనే సందేశం అందించాలని పిలుపునిచ్చారు.
వీరమరణం పొందిన సైనికులకు కేంద్రం ఎలాగూ సాయం చేస్తుంది. కానీ రాష్ర్టాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కలుగుతుందన్నారు. సింబల్ ఆఫ్ యూనిటీని ప్రదర్శించాలన్నారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని సైనికుల సంక్షేమానికి పాటుపడుతమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.