అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట : రూ. 250 కోట్లు కేటాయింపు

విజయవాడ : అగ్రీగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది. 10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. డిపాజిట్లు చెల్లించేందుకు రూ. 250 కోట్లు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 10వేల లోపు డిపాజిట్లు కలిగిన బాధితులు 3.5 లక్షల మంది ఉన్నట్లు సర్కారు అంచనా వేస్తోంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం పర్యవేక్షణలో జిల్లా స్ధాయి కమిటీల ద్వారా.. బాధితులకు డబ్బు చెల్లించాలని నిర్ణయించింది.