కరోనాకు మందు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్తో వైరస్ చనిపోతుంది-సీఎం జగన్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం తొలిసారి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదన్నారు జగన్. కరోనా గురించి అంతగా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం తొలిసారి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదన్నారు జగన్. కరోనా గురించి అంతగా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం తొలిసారి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదన్నారు జగన్. కరోనా గురించి అంతగా భయపడాల్సిన పని లేదన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమవుతుందన్నారు. ఆదివారం(మార్చి 15,2020) మీడియాతో మాట్లాడిన సీఎం జగన్ కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనాతో మనుషులు చనిపోతున్నారని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. కరోనాకి మందు(మెడికేషన్) పారాసిటమాల్ ట్యాబ్లెట్ అని చెప్పిన సీఎం జగన్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా వైరస్ చనిపోతుందన్నారు.
85వేల మందికి కరోనా వస్తే 65వేల మందికి నయమైంది:
చైనాలో 85వేల మందికి కరోనా వస్తే 65వేల మందికి నయం అయ్యిందని వారంతా బయట తిరుగుతున్నారని జగన్ చెప్పారు. 60ఏళ్లు పైబడిన వారికి అందునా బీపీ, షుగర్, ఆస్తమా, కిడ్నీ, లివర్, గుండె సమస్యలతో బాధపడుతున్న వారికే కరోనా ముప్పు ఎక్కువగా ఉందని సీఎం జగన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లో 81శాతం ఇంట్లోనే ఉంటూ రికవర్ అయ్యారని తెలిపారు. కేవలం 13.8శాతం కేసులు మాత్రమే ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారని చెప్పారు. కేవలం 4.7శాతం కేసులు మాత్రమే క్రిటికల్ అంటే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని సీఎం వెల్లడించారు. ఇదే రియాలిటీ అన్నారు.
క్వారంటైన్ నిరంతర ప్రక్రియ:
కరోనా కట్టడికి ఏపీలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని సీఎం జగన్ చెప్పారు. కరోనా కట్టడి ప్రక్రియ అనేది వారమో రెండు వారాలో కొనసాగే ప్రక్రియ కాదని, మరో ఏడాది పాటు కొనసాగించాల్సిన నిరంతర ప్రకియ అని జగన్ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు తీవ్రంగా కనిపిస్తే.. వారిని ఆసుపత్రులకు తరలించి ఐసోలేషన్ వార్డులో పెడతామన్నారు. లక్షణాలు తీవ్రత తక్కువగా ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్ లో పెడతామన్నారు. క్వారంటైన్ లో ఉంచే ప్రక్రియ నిరంరంతరం కొనసాగుతుందన్నారు.
బ్లీచింగ్ పౌడర్ తో కరోనా వైరస్ ఖతం:
జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న చోట్లకు వెళ్లకపోవడమే మంచిదన్నారు సీఎం జగన్. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమం అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సినిమా థియేటర్లకు, షాపింగ్ మాల్స్ కు వెళ్లాలని సూచించారు. ఇలాంటి ప్రక్రియ ఏ వారమో రెండు వారాలో కొనసాగేది కాదని, మరో ఏడాది పాటు ఇవన్నీ జరగాల్సిన కార్యక్రమాలు అన్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా బాధితులు ఉంటే, ఇంట్లో వారి సామాన్లు ఎలా డిస్పోజ్ చేయాలో కుటుంబసభ్యులకు నేర్పిస్తామని జగన్ చెప్పారు. కరోనా బాధితులు వాడిన దుస్తులు లేదా సామాన్లపై బ్లీచింగ్ పౌడర్ వేస్తే సరిపోతుందన్నారు. అలా 6 గంటల పాటు బ్లీచింగ్ పౌడర్ ఉంటే కరోనా వైరస్ చనిపోతుందని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు రాష్ట్రంలో కొనసాగుతాయన్నారు.