AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని..

AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

AP Rains

Updated On : July 20, 2025 / 6:26 PM IST

AP Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. చెట్ల కింద ఉండొద్దన్నారు. శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.

సోమవారం (21-07-2025) విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించిన విపత్తుల నిర్వహణ శాఖ.. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆదివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Also Read: వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి‌కి 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

అటు తెలంగాణలోనూ వర్షాలు దంచికొట్టనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.