Women Passengers Fight: ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళా ప్రయాణికుల ఫైటింగ్.. సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.. వీడియో వైరల్

ముంబైలోని థానే-పన్వేల్ లోకల్ రైలులోని మహిళల కంపార్ట్‌మెంట్‌లో మహిళా ప్రయాణికుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. ట్రైన్‌లో సీటుకోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.

Women Passengers Fight: ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళా ప్రయాణికుల ఫైటింగ్.. సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.. వీడియో వైరల్

Womens fight

Women Passengers Fight: ముంబైలోని థానే-పన్వేల్ లోకల్ రైలులోని మహిళల కంపార్ట్‌మెంట్‌లో మహిళా ప్రయాణికుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. ట్రైన్‌లో సీటుకోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో కొద్దిసేపు ట్రైన్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వారిని వారించే ప్రయత్నంలో మహిళా పోలీస్ కు సైతం గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Smoking: మీకు ధూమపానం అలవాటుందా? అయితే జాగ్రత్త.. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఏం చెప్పారంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తుర్బే స్టేషన్‌లో లోకల్ రైలు ఆగింది. కొందరు మహిళలు రైలు ఎక్కారు. ట్రైన్‌లో ఒక్క సీటు మాత్రమే ఖాళీగా ఉంది. అప్పటికే ఆ సీటులో కూర్చున్న మహిళా ప్రయాణికురాలు మరో మహిళకు ఆ సీటును ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మూడో మహిళ వచ్చి ఆ సీటులో కూర్చుంది. దీంతో ముగ్గురు మహిళల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మహిళ ప్రయాణికుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ట్రైన్‌లో సీటుకోసం ఒకరిపైఒకరు చేయిచేసుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. వీరిమధ్య కొట్లాటను నివారించేందుకు ప్రయత్నించిన ఓ మహిళ పోలీసుకు గాయాలయ్యాయి. మహిళతో సహా కనీసం ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఈ ఘటనపై వాషి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ శంభాజీ కటారే తెలిపారు.