Revanth Reddy : కాంగ్రెస్ కు ఎవరూ సాయం చేయకుండా కేటీఆర్ బెదిరింపులు.. తగిన మూల్యం చెల్లించక తప్పదు : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఫోన్ లో ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారని తెలిపారు.

Revanth Reddy : కాంగ్రెస్ కు ఎవరూ సాయం చేయకుండా కేటీఆర్ బెదిరింపులు.. తగిన మూల్యం చెల్లించక తప్పదు : రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy (4)

Revanth Reddy Warning KTR : సీట్లు, ఓట్లు కంటే ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఒక నియంతను గద్దె దించి ప్రజా పాలన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రైవేటు సైన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. టెలిఫోన్ ట్యాపింగ్ తో పాటు హ్యాకర్స్ ను ఉపయోగించి తమ ఫోన్ లు హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం రేవంత్ రెడ్డి టీజేఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు ఎవరూ సాయం చేయకుండా కేటీఆర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము ఫోన్ లో ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారని తెలిపారు. తమను సంప్రదించిన వారిని కూడా బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Vishnu Vardhan Reddy : ఫలించిన మంత్రి హరీశ్ రావు భేటీ .. బీఆర్ఎస్‌లోకి విష్ణువర్థన్ రెడ్డి

కాంగ్రెస్ కు కోదండరాం మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం

గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కోదండరాం పోరాడుతున్నారని రేవంత్ తెలిపారు. కోదండరాం మద్దతు కాంగ్రెస్ కు ఇవ్వాలని కోరేందుకు ఇక్కడికి వచ్చామని వెల్లడించారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరం అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని చెప్పారు.

భవిష్యత్ లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళతామని పేర్కొన్నారు. టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుందన్నారు. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందని తెలిపారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్ కు కీలక స్థానం ఉంటుందని వెల్లడించారు.