ఏపీలో కరోనా కేసులన్నీ కంటైన్ మెంట్ జోన్స్ నుంచే…గ్రీన్ జోన్స్ సేఫ్

ఏపీలో కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ మంగళవారం(ఏప్రిల్ 28,2020) సమీక్ష నిర్వహించారు. మంత్రి మోపిదేవి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్‌ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి వివరాలు అందించారు.

ఏపీలో కరోనా కేసులన్నీ కంటైన్ మెంట్ జోన్స్ నుంచే…గ్రీన్ జోన్స్ సేఫ్

ఏపీలో కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ మంగళవారం(ఏప్రిల్ 28,2020) సమీక్ష నిర్వహించారు. మంత్రి మోపిదేవి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్‌ హాజరయ్యారు.  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి వివరాలు అందించారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటివరకు 80వేల 334 పరీక్షలు చేయించామన్నారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1504 చొప్పున పరీక్షలు చేయిస్తున్నామని అధికారులు వెల్లడించారు. దేశంలోనే అధిక సగటుతో కరోనా పరీక్షలు చేసి ప్రథమ స్థానంలో ఉన్నామని సీఎంకు తెలిపారు.

పాజిటివ్‌ కేసుల సగటు దేశం మొత్తం 4.13 శాతం అయితే, ఏపీలో 1.57శాతం అని, అలాగే డెత్‌రేటు దేశం మొత్తం 3.19 శాతం అయితే మరణాల రేటు 2.46 శాతం అని వెల్లడించిన అధికారులు. కాగా ఈ కరోనా కేసులన్నీ కూడా కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచే వస్తున్నాయని అధికారులు తెలిపారు. గ్రీన్ జోన్స్ అన్నీ సేఫ్ గానే ఉన్నాయన్నారు. కంటైన్‌మెంట్‌ ఆపరేషన్స్‌లో భాగంగా అక్కడ ముమ్మరంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని, విస్తృతస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
* శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ల్యాబ్ లు సిద్ధం అవుతున్నాయి
* విజయనగరం, ప.గో.జిల్లాల్లో ల్యాబ్ ల ఏర్పాటుపైనా దృష్టి
* తద్వారా ప్రతి జిల్లాలో ల్యాబ్ ఉన్నట్టే
* మైల్డ్‌ సింప్టమ్స్‌ ఉన్నవారు హోం ఐసోలేషన్‌ కోరుకుంటే అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిందన్న అధికారులు
* టెలిమెడిసిన్‌లో భాగంగా వైద్యం తీసుకుంటున్నవారికి మందులు కూడా సరఫరా చేసే విధానం సమర్థవంతంగా ఉండాలన్న సీఎం జగన్
* దీనికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్న అధికారులు
వ్యవసాయం అనుబంధ రంగాలపై సీఎం సమీక్ష:
* రాష్ట్రంలోని వివిధ పంటల మార్కెటింగ్, ధరలు అంశాలపై సీఎం సమీక్ష
* మొక్కజొన్న, శెనగ, ధాన్యం కొనుగోళ్లపై ఆరా
* బత్తాయి, అరటి రైతుల సమస్యలపైనా చర్చ
* నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చోట మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుంటోందన్న అధికారులు
* బయట రాష్ట్రాల్లో మార్కెట్లు తెరిచారా? లేదా? మన రాష్ట్రం నుంచి అక్కడకు రవాణా అవుతుందా? లేదా? అక్కడ విక్రయాలు ఎలా ఉన్నాయి? వాటి ధరలతో ప్రతిరోజూ సమీక్షా సమావేశానికి వివరాలతో రావాలని సీఎం ఆదేశం.

* రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులన్నీ బయట రాష్ట్రాలకు ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుందన్న సీఎం, దీనిపై పత్యేక దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి
* అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా తల్లి రొయ్యలు, రొయ్యపిల్లల కొరతపై సమావేశంలో చర్చ
* తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవికి ఆదేశం
* సీఎం ఆదేశాల మేరకు అగ్రి ప్రాసెసింగ్‌లో సమస్యలు చాలా వరకు తొలగిపోయిందన్న అధికారులు
* ఫాంగేట్‌ పద్ధతిలో ధాన్యం కొనుగోలు స్టెబిలైజ్‌ అవుతుందన్న అధికారులు
* ఎక్కడ రైతులకు ఇబ్బందులు వచ్చినా.. అక్కడ జోక్యం చేసుకుని రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని మరోసారి స్పష్టం చేసిన సీఎం.