Corona Fees : ఆక్సిజన్ బెడ్కు రోజుకు రూ.6,500, వెంటిలేటర్తో కూడిన ఐసీయూకి రూ.16వేలు.. ఏపీలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలకు ఫీజులు ఖరారు
ఆక్సిజన్ బెడ్ కు రూ.6వేల 500 మాత్రమే చార్జ్ చేయాలి. అదే వెంటిలేటర్ తో కూడిన ఐసీయూకి అయితే..16వేలు మాత్రమే చార్జి చేయాలి.. కరోనా రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు ఇవి.
Corona Treatment Fees : Corona Treatment Fees : ప్రస్తుతం కరోనా చికిత్స పేరుతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీ జరుగుతోంది. ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎవరికి తోచినట్టుగా వారు లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నారు. బాధితులను నిలువునా దోచేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీకి అడ్డుకట్ట వేసింది. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా చర్యలు చేపట్టింది. కరోనా రోగులకు అందించే చికిత్సకు సంబంధించి ప్రభుత్వం ధరలు ఖరారు చేసింది.
ఆక్సిజన్ బెడ్ కు రూ.6వేల 500 మాత్రమే చార్జ్ చేయాలి. అదే వెంటిలేటర్ తో కూడిన ఐసీయూకి అయితే..16వేలు మాత్రమే చార్జి చేయాలి.. కరోనా రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు ఇవి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధులు, యాజమాన్యాలతో చర్చించిన అనంతరం ప్రభుత్వ ధరలు నిర్ధారించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ శుక్రవారం(ఏప్రిల్ 30,2021) ఉత్తర్వులిచ్చారు.
ఎన్ఏబీహెచ్ (నేషనల్ అక్రిడిడేటెడ్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్), నాన్ ఎన్ఏబీహెచ్లుగా విభజించి రేట్లు నిర్ణయించింది. రోగికి సంబంధించి అన్నీ కలిపే ఈ ధరలు నిర్ణయించారు. కన్సల్టేషన్, నర్సింగ్ చార్జీలు, రూమ్ అద్దె, భోజనం, కోవిడ్ టెస్టింగ్, రక్తపరీక్షలు, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ పరీక్షలు, పీపీఈ కిట్లు, మందులు, యూరినరీ ట్రాక్ట్ కేథటరైజేషన్ వంటివన్నీ ఇందులోనే ఉంటాయన్నారు. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి కోవిడ్ రోగిని అడ్మిట్ చేసుకోవాల్సిందే అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాదు అడ్మిషన్ సమయంలో అడ్వాన్స్ కోసం డిమాండ్ చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.
సీటీ స్కాన్కు రూ.3 వేలు:
అలాగే సీటీ స్కాన్కు రూ.3 వేలకు మించి తీసుకోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెమ్డెసివిర్ ఇంజక్షన్కు ఒక్కోదానికి రూ.2,500, తోసిజుమాంబ్ ఇంజక్షన్కు రూ.30 వేలు తీసుకోవచ్చంది. ఇంతకుమించి ఏ ఆస్పత్రి ఎక్కువ వసూలు చేసినా వాటిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు, కమిషనర్ ఆఫ్ పోలీస్, జిల్లా వైద్యాధికారులు, తదితరులకు కల్పించింది ప్రభుత్వం. వెంటనే ఈ రేట్లు అమల్లోకి వస్తాయని, జిల్లా కలెక్టర్లు నిరంతరం వీటిని పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో తెలిపింది ప్రభుత్వం.
సీటీ స్కాన్కు రూ.3 వేలు
అలాగే సీటీ స్కాన్కు రూ.3 వేలకు మించి తీసుకోకూడదని ప్రభుత్వం పేర్కొంది. రెమ్డెసివిర్ ఇంజక్షన్కు ఒక్కోదానికి రూ.2,500, తోసిజుమాంబ్ ఇంజక్షన్కు రూ.30 వేలు తీసుకోవచ్చు. ఇంతకుమించి ఏ ఆస్పత్రి ఎక్కువ వసూలు చేసినా వాటిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు, కమిషనర్ ఆఫ్ పోలీస్, జిల్లా వైద్యాధికారులు, తదితరులకు కల్పించారు. తక్షణమే ఈ రేట్లు అమల్లోకి వస్తాయని, జిల్లా కలెక్టర్లు నిరంతరం వీటిని పర్యవేక్షించాలని ప్రభుత్వం చెప్పింది.
రోజుకు ఆసుపత్రుల వారీగా తీసుకోవాల్సిన రేట్లు..
జబ్బు కేటగిరీ ఎన్ఏబీ హెచ్ ధర నాన్ ఎన్ఏబీహెచ్ ధర
నాన్ క్రిటికల్ కోవిడ్ రూ.4వేలు రూ.3,600
నాన్ క్రిటికల్ ఓ2 రూ.6,500 రూ.5,800
క్రిటికల్ – ఐసీయూ రూ.12వేలు రూ.10,800
క్రిటికల్-ఐసీయూ-వెంటిలేటర్ రూ.16వేలు రూ.14,400