AP Corona : ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. కొత్తగా ఎన్ని కేసులంటే..
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు.. ఇప్పుడు క్రమంగా పెరుగు
AP Corona : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు.. ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 1500కుపైనే పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం.
Red Ant Chutney : కరోనాకు నివారణగా ఎర్రచీమల చట్నీ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
గడిచిన 24 గంటల వ్యవధిలో 67వేల 911 నమూనాలను పరీక్షించగా.. 1,608 మందికి కరోనా సోకినట్లు తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 281 మందికి కరోనా నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో 261, తూర్పు గోదావరి జిల్లాలో 213, కృష్ణా జిల్లాలో 161, పశ్చిమ గోదావరి జిల్లాలో 154 కేసులు నమోదయ్యాయి.
తాజాగా నమోదైన కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,27,650కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో మరో ఆరుగురు మృతి చెందారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,970కి పెరిగింది.
Medchal : అక్రమ సంబంధం.. ప్రియురాలిని భూమిలో పాతిపెట్టిన ప్రియుడు
గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1,107 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 19,98,561కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 15వేల 119 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అదే సమయంలో కేసుల సంఖ్య పెరగడం కలవరానికి గురి చేస్తోంది.
#COVIDUpdates: 10/09/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,24,755 పాజిటివ్ కేసు లకు గాను
*19,95,666 మంది డిశ్చార్జ్ కాగా
*13,970 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,119#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0fRLcmUfH1— ArogyaAndhra (@ArogyaAndhra) September 10, 2021