Telugu States Bypoll : హుజూరాబాద్, బద్వేల్లో పోలింగ్ సమాప్తం
గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో అదరగొట్టిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

Huzurabad, Badvel Bypolls : గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో అదరగొట్టిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎవరు గెలిచారనేది మాత్రం సస్పెన్స్. తెలుగు రాష్ట్రాల్లోని బద్వేల్, హుజూరాబాద్ లలో 2021, అక్టోబర్ 30వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటలకు ముగిసింది. అప్పటి వరకు క్యూ లైన్ లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతినిస్తున్నారు. పలు చోట్ల ఉద్రిక్తతల మధ్యే పోలింగ్ కొనసాగినా… ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. బద్వేల్ లో మాత్రం మందకొడిగా నమోదైందని తెలుస్తోంది.
Read More : Rahul Gandhi: బైక్ ట్యాక్సీపై ప్రయాణించిన రాహుల్ గాంధీ
హుజూరాబాద్ ఉఫ ఎన్నిక : –
ఓట్లు వేయడానికి ఓటర్లు క్యూ కట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం నమోదయింది. సాయంత్రం అయ్యే వరకు భారీగా ఓటింగ్ నమోదైంది. జూన్ 12న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయటంతో హుజూరాబాద్ లో బై పోల్ జరగుతోంది. ఉప ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. శనివారం జరిగిన ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ సాగింది. గంట గంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది.
Read More : UP : విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్స్పాల్ అరెస్టు!
ఉత్సాహం చూపిన ఓటర్లు: –
ఓటేసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపించారు. సాయంత్రం 5 గంటల వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో 76.26 శాతం పోలింగ్ నమోదైందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చెదురుమెదురు ఘటనలు మినహా హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. హుజురాబాద్ నియోజకవర్గ నికి ఇది మూడో ఉప ఎన్నిక. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ బరిలో ఉన్నారు.
Read More : WhatsApp Stop : నవంబర్ 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి!
బద్వేల్ ఉప ఎన్నిక : –
2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో చనిపోయిన వారి జ్ఞాపకార్థం టీడీపీ, జనసేనలు బద్వేల్ లో పోటీ చెయ్యట్లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటీలో నిల్చున్నారు. బద్వేల్ లో అధికారపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థిగా మరణించిన వెంకటసుబ్బయ్య భార్య సుధను బరిలో దింపింది.
Read More : Badvel By Poll : బద్వేల్లో ప్రశాంతంగా ఉపఎన్నిక.. 3 గంటల వరకు 44.82 శాతం పోలింగ్
అక్కడక్కడ వర్షం..చిరుజల్లులు : –
బద్వేల్లో మొత్తం 281 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసింది ఈసీ.2021, అక్టోబర్ 30వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కానీ..ఇక్కడ పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. కడప జిల్లా బద్వేల్లో ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 59.58 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి నియోజకవర్గంలో అక్కడక్కడ వర్షం, చిరుజల్లులు పడుతుండటంతో… పోలింగ్కు కాస్త అడ్డంకిగా మారింది. సాయంత్రం వేళ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. పోలింగ్ సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఎన్నికల సిబ్బంది ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. మొత్తంగా బద్వేల్, హుజూరాబాద్ లలో ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం నమోదైన ఓటింగ్ శాతం, సరళిని గెలుపు అవకాశాలను నేతలను పరిశీలిస్తున్నారు. నవంబర్ 02వ తేదీన ఫలితం వెలువడనుంది.
- TRS and BJP : టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
- Karimnagar : సెల్పీ మోజులో కాలువలో పడ్డ ఫోన్ …. ఫోన్ కోసం కాలువలో దిగి యువకుడు గల్లంతు
- Telangana : ఎన్నికలకు ముందే.. హీట్ ఎక్కిన తెలంగాణ రాజకీయం!
- BJP vs YCP: బీజేపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్
- Wife Protest : కాపురానికి తీసుకు వెళ్లలేదని భర్త ఇంటిముందు భార్య నిరసన
1Virender Sehwag: “ఆ మ్యాచ్లు ఆడకపోతే పంత్ను పట్టించుకోరు”
2CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
3RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
4IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్కు రాజస్తాన్
5Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
6IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
7Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
8Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
9Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
10Nara Lokesh On Scams : మహానాడు తర్వాత కుంభకోణాలు బటయపెడతా-నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య