కోలార్ లో రూ. 50 లక్షల విలువైన ఎర్ర చందనం స్వాధీనం

కోలార్ లో రూ. 50 లక్షల విలువైన ఎర్ర చందనం స్వాధీనం

Tirupati task force police arrest 5 men in kolar, for red sandalwood smugglingతిరుమలలోని శేషాచలం అడవులనుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను తిరుపతి టాస్క్ పోరక్స్ పోలీసులు కర్ణాటక రాష్ట్రం కోలార్ వద్ద పట్టుకున్నారు.

తిరుమల కొండల్లోంచి ఎర్ర చందనం దుంగలను ఇన్నోవాలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించారు. కర్ణాటకలోని కోలార్ పోలీసు స్టేషన్ పరిధిలోని నెర్నహల్లి వద్ద ఇన్నోవాను పంక్చర్ చేసి ఆపారు. అందులో తరలిస్తున్న రూ.50 లక్షల విలువైనఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.