తండ్రితో కలిసి కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం : బైక్‌ను ఢీకొట్టిన కంటైనర్‌…ఇద్దరు చిన్నారుల మృతి

తండ్రితో కలిసి కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం : బైక్‌ను ఢీకొట్టిన కంటైనర్‌…ఇద్దరు చిన్నారుల మృతి

Two children killed in a road accident : తూర్పుగోదావరి జిల్లా తునిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఓ కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. కూలి పనికి తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

చిన్నారుల తలలపై నుంచి కంటైనర్‌ వెళ్లడంతో ఛిద్రమైపోయాయి. మృతులను కోటవురట్లకు చెందిన దుర్గ, తాతాజీగా గుర్తించారు. నిర్జీవంగా పడిఉన్న కొడుకు, కూతురును చూసి తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.