గుజరాత్లో ఘోర బస్సు ప్రమాదం : 21మంది మృతి.. 50మందికి గాయాలు
గుజరాత్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు లోయలో పడి 18మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
గుజరాత్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు లోయలో పడి 18మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
గుజరాత్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు లోయలో పడి 21మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం (సెప్టెంబర్ 30, 2019) గుజరాత్ నార్తరన్ బనస్కాంత జిల్లాలోని అంబాజీ సమీపంలో జరిగింది. ఇటీవల బనస్కాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురియడంతో రోడ్లన్నీ బురదమయమయ్యాయి.
దీంతో ఆ మార్గాల్లో వెళ్లే వాహలన్నీ జారిపోతున్నాయి. పక్కనే లోయ ఉండటంతో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయాడు. బస్సు ప్రమాద సమయంలో మొత్తం 70 మందికి పైగా ప్రయాణికులు ఉండగా వారిలో 21 మంది అక్కడిక్కడే మృతిచెందినట్టు అదనపు జిల్లా వైద్యాధికారి ధ్రువీకరించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం బనస్కాంతలోని సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘బస్సు ప్రమాదంలో ప్రయాణికులు మృతిచెందడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడ్డ బాధితులకు సాధ్యమైనంత తొందరంగా వైద్య సాయం అందించేలా స్థానిక అధికారులు చూడాలి. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోడీ ట్వీట్ చేశారు.
మరోవైపు హోం మంత్రి అమిత్ షా కూడా బస్సు ప్రమాద ఘటనపై తన సంతాపాన్ని తెలియజేశారు. బస్సు ప్రమాదంలో మృతిచెందినవారి పట్ల విచారం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి ప్రతిఒక్కరికి సాధ్యమైనంత తొందరగా అత్యవసర సాయం అందించాలని కోరినట్టు ట్వీట్ చేశారు. గాయపడ్డ ప్రయాణికులు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాని, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు.
Devastating news from Banaskantha. I am extremely pained by the loss of lives due to an accident. In this hour of grief, my thoughts are with the bereaved families.
The local administration is providing all possible help to the injured. May they recover soon.
— Narendra Modi (@narendramodi) September 30, 2019
Deeply anguished by the loss of lives due to a tragic bus accident in Banaskantha, Gujarat. Have spoken to the state and local authorities, they are doing everything possible to help the people in need.
My deepest condolences. May the injured recover at the earliest.
— Amit Shah (@AmitShah) September 30, 2019