Naveen Case : నవీన్ హత్య కేసు.. మర్డర్ చేశాక రెస్టారెంట్‌లో భోజనం చేసిన హరి, నిహారిక.. ఖర్చుల కోసం రూ.1500 ఇచ్చింది

రోజుకో డ్రామా.. పూటకో ట్విస్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ట్రయాంగిల్ మర్డర్ కేసు అనూహ్య మలుపు తీసుకుంది. పది రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఎలాంటి స్పష్టత ఇవ్వని నిందితుడు హరిహరకృష్ణ.. ఎట్టకేలకు నోరు విప్పాడు. తన ప్రియురాలు నిహారిక కోసమే నవీన్ ను హత్య చేసినట్లు పోలీస్ కస్టడీలో తెలిపాడు. దీంతో పోలీసులు నిహారిక, హరి ఫ్రెండ్ హసన్ ను ఈ కేసులో నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు.

Naveen Case : నవీన్ హత్య కేసు.. మర్డర్ చేశాక రెస్టారెంట్‌లో భోజనం చేసిన హరి, నిహారిక.. ఖర్చుల కోసం రూ.1500 ఇచ్చింది

Naveen Case : రోజుకో డ్రామా.. పూటకో ట్విస్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ట్రయాంగిల్ మర్డర్ కేసు అనూహ్య మలుపు తీసుకుంది. పది రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఎలాంటి స్పష్టత ఇవ్వని నిందితుడు హరిహరకృష్ణ.. ఎట్టకేలకు నోరు విప్పాడు. తన ప్రియురాలు నిహారిక కోసమే నవీన్ ను హత్య చేసినట్లు పోలీస్ కస్టడీలో తెలిపాడు. దీంతో పోలీసులు నిహారిక, హరి ఫ్రెండ్ హసన్ ను ఈ కేసులో నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు.

ఈ కేసుకి సంబంధించి పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం అని తేల్చారు. హత్యకు ముందు.. నిహారిక, హసన్ లకు ప్రమేయం లేదన్నారు. హత్య తర్వాత నిహారిక హరికి ఖర్చుల కోసం రూ.1500 ఆన్ లైన్ లో ట్రాన్సఫర్ చేసిందని పోలీసులు తెలిపారు. నవీన్ హత్య తర్వాత ఘటనా స్థలానికి నిందితుడు హరి, నిహారిక వెళ్లారు. అక్కడ ఓ రెస్టారెంట్ లో భోజనం చేశారు. ఆ తర్వాత హసన్ కూడా నవీన్ ను హత్య చేసిన స్పాట్ కు వెళ్లాడు.

Also Read..Abdullapurmet Naveen Case : హరిహరకృష్ణలో కనిపించని పశ్చాత్తాపం, చట్టంలో లొసుగులే బయటకు తీసుకొస్తాయని ధీమా

నిహారిక తన ఫోన్ లోని డేటాను డిలీట్ చేసిందని, తద్వారా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కు పాల్పడిందని పోలీసులు తెలిపారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత.. నిందితుడు హరికి.. అతడి స్నేహితుడు హసన్ షెల్టర్ ఇచ్చాడు. రక్తపు మరకలు ఉన్న దుస్తులను హసన్ ఇంట్లోనే మార్చుకున్నాడు హరి. ఆ తర్వాత హసన్ బట్టలు వేసుకున్నాడు. రాత్రి అక్కడే ఉండి ఉదయం వెళ్లిపోయాడు. నవీన్ ను హరిహరకృష్ణ ఒక్కడే మర్డర్ చేశాడని, మృతదేహాన్ని దహనం చేసేందుకు హసన్ సహకరించాడని పోలీసులు తేల్చారు.

ఫిబ్రవరి 17న నవీన్ హత్య కాగా, ఫిబ్రవరి 24న హరి అరెస్ట్ అయ్యాడు. 10 రోజుల తర్వాత పోలీసు కస్టడీలో హరి నోరు విప్పడంతో నిహారిక, హసన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ ను హరి హత్య చేశాడు. నవీన్ కనిపించకపోవడంతో అతడి స్నేహితులు నవీన్ తండ్రికి సమాచారం ఇచ్చారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన సమయంలో తండ్రి సూచనలతో ఫిబ్రవరి 24న నిందితుడు హరిహరకృష్ణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Also Read..Abdullapurmet Incident : నవీన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు.. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హరిహర కృష్ణ

పోలీసులు నిందితుడిని ఆ మరుసటి రోజు రిమాండ్ కు తరలించారు. హయత్ నగర్ కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ వేయగా రంగారెడ్డి కోర్టు వారం రోజుల పాటు అనుమతించింది. అయితే నిన్నటి వరకు పోలీసులకు సహకరించని హరిహరకృష్ణ ఇవాళ(మార్చి 6) ఎట్టకేలకు నోరు విప్పాడు. నవీన్ హత్య కేసులో తన ప్రియురాలు నిహారిక, స్నేహితుడు హసన్ పాత్ర ఉందని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు.

హరిహరకృష్ణ, నవీన్. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. మంచి స్నేహితులు కూడా. దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్ అనే స్థాయిలో ఇద్దరూ తిరిగారు. ప్రేమ దేశంలో అబ్బాస్, వినీత్ ను మరిపించారు. ఒకే అమ్మాయితో లవ్ లో పడ్డారు. ఆ సినిమాలో హీరోలు ఒకే అమ్మాయి కోసం కొట్టుకుని విడిపోతే.. ఇక్కడ మాత్రం చంపుకునే స్థాయికి వైరం పెరిగింది. నవీన్ కారణంగా తాను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ తనకు దక్కకుండా పోతుందోనని హరి భయపడ్డాడు. నవీన్ పై కక్ష పెంచుకుని మరీ మర్డర్ చేశాడు. స్నేహితుడిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత శరీరంలోని ఒక్కో అవయవాన్ని కోస్తూ శరీరం నుంచి వేరు చేస్తూ తన కసిని చల్లార్చుకున్నాడు.

Also Read..Abdullapurmet Incident : హత్య చేసి మర్మాంగాన్ని కోసి.. నవీన్ మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

అయితే, ఇదేదో క్షణికావేశంలో హరి చేశాడనుకుంటే పొరపాటే అంటున్నారు పోలీసులు. పక్కాగా ప్లాన్ చేసి వెయిట్ చేసి సెలెక్ట్ చేసుకుని మరీ తన స్కెచ్ ని అమలు చేశాడు స్నేహితుడి ప్రాణం తీశాడు. సైకో లవర్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు ఎన్నో ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చూస్తే నిందితుడు హరిహరకృష్ణ ఎంత సైకోగా ప్రవర్తించాడో, హత్య చేసే సమయంలో అతడి మానసిక స్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. హత్య చేశాక నిందితుడు హరి స్వయంగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. నవీన్ ను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. స్నేహితుడు మర్డర్ కు సంబంధించి నిందితుడు హరి.. షాకింగ్ విషయాలు బటయపెట్టాడు. ప్రేమ వ్యవహారంలోనే నవీన్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

నవీన్ హత్యకు ప్రధాన కారణం ట్రయాంగిల్ లవ్ స్టోరీనే. నిందితుడు హరి, హత్యకు గురైన నవీన్ ఇద్దరూ కలిసి దిల్ సుఖ్ నగర్ లోని ఓ కాలేజీలో ఇంటర్ చదివారు. అదే సమయంలో నవీన్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. నవీన్ ప్రేమను ఆ అమ్మాయి కూడా అంగీకరించింది. రెండేళ్ల కిందట ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ అమ్మాయికే ప్రపోజ్ చేశాడు నిందితుడు హరిహరకృష్ణ. ఆ అమ్మాయి కూడా ప్రేమను అంగీకరించడంతో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఇంతలోనే నవీన్ మళ్లీ ఆ అమ్మాయికి ఫోన్లు చేయడం, మేసేజ్ లు పంపడం లాంటివి చేశాడు. దాంతో నిందితుడు హరిహరకృష్ణ.. నవీన్ పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా నవీన్ ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సరైన సమయం కోసం మూడు నెలలుగా ఎదురు చూసి చూసి చివరకు పధకం ప్రకారం నవీన్ ను లేపేశాడు.

Also Read..Abdullapurmet Incident : హత్య చేసి మర్మాంగాన్ని కోసి.. నవీన్ మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

ఈ నెల 17న హరి, నవీన్ ఎల్బీనగర్ ప్రాంతంలో కలుసుకున్నారు. కొన్ని చోట్ల తిరిగిన తర్వాత మూసారాంబాగ్ లోని హరిహరకృష్ణ ఇంటికి వెళ్లారు. రాత్రి కావడంతో మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని తన కాలేజీ హాస్టల్ కు వెళ్తానని చెప్పాడు నవీన్. దాంతో తాను బైక్ పై దింపుతానని చెప్పి ప్లాన్ ప్రకారం పెద్ద అంబర్ పేట్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు హరిహరకృష్ణ. అక్కడే ఇద్దరి మధ్య ప్రేమ విషయంలో గొడవ జరిగింది. తర్వాత నవీన్ ను గొంతు నులిమి చంపేశాడు. తర్వాత తాను ముందే అనుకున్నట్లుగా ఒక కత్తి కూడా వెంట తెచ్చుకున్నాడు. దాంతో నవీన్ తలను మొండెం నుంచి వేరు చేశాడు. తర్వాత శరీరంలో నుంచి నవీన్ గుండెను వేరు చేశాడు. అతడి ప్రైవేట్ భాగాలను, చేతి వేళ్లను కూడా కోసేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.