Darbhanga Blast Case : దర్భంగా బ్లాస్ట్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఈ నెల 23 వరకు నిందితులకు రిమాండ్ విధించారు. కస్టడీ సమయంలో ఎన్ఐఏ అధికారులు నిందితుల వద్ద నుంచి పలు కీలక విషయాలు రాబట్టారు.
Darbhanga Blast Case : దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఈ నెల 23 వరకు నిందితులకు రిమాండ్ విధించారు. కస్టడీ సమయంలో ఎన్ఐఏ అధికారులు నిందితుల వద్ద నుంచి పలు కీలక విషయాలు రాబట్టారు. దర్భంగా పేలుళ్ల కుట్ర వెనుక లష్కరే తోయిబా ముఖ్య నేత ఇక్బాల్ హస్తం ఉన్నట్లుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు.
లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ తో పాటు అండర్ వరల్డ్ డాన్ మోమేన్ ఆదేశాలతోనే భారత్లో పేలుళ్లకు కుట్ర పన్నారు. వారి ఆదేశాలతో ఇక్బాల్ ఖన్నా వ్యూహాలు రచించాడు. ఇక్బాల్ వ్యూహాలను అమలు చేసేందుకు ఇక్బాల్ సొంత గ్రామం ఖైరానాకు చెందిన పరిచయస్తులతో చేయించాలనుకున్నారు. కాగా….దర్భంగా బ్లాస్ట్ కేసులో ఖలిం అనే మరో వ్యక్తి పాత్ర బయటపడినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.
పాకిస్తాన్ నుండి ఇక్బాల్ ఖన్నా ఆదేశాలు ఇచ్చేందుకు సోషల్ మీడియా ద్వారా వాయిస్ కాల్స్ చేసేవాడు. ఈ కేసులో మరో ముఖ్యుడైన హాజీ సలీంకి ఇంటర్నెట్పై అవగాహన లేకపోవడంతో ఖలీం అనే వ్యక్తి సహాయం తీసుకున్నాడు. ఖలీం సోషల్ మీడియా ఖాతా ద్వారా హాజీ సలీమ్తో, ఇక్బాల్ ఖన్నావాయిస్ కాల్స్ మాట్లాడాడు.
ఒక్కో బ్లాస్ట్కు కోటి రూపాయల నజరానా ఇస్తామని ఇక్బాల్ మాలిక్ సోదరులకు ఆశ చూపించాడు. 2012లో పాకిస్థాన్ ఆఫ్గన్ సరిహద్దులో లష్కరే తోయిబా కు చెందిన ముఖ్య నేతలను కలిసినట్టు నజీర్ మాలిక్, హాజీ సలీం అంగీకరించారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.