మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని : మాజీ ప్రియురాలి గొంతుకోశాడు
మంచిర్యాల జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన మాజీ ప్రియురాలు గొంతుకోసి తానూ సీసాతో గొంతుకోసుకున్నాడు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్లోని రామాలయం దగ్గర గంగుల కమలాకర్, యువతి గతంలో ప్రేమికులు. అయితే యువతి పెద్దలు మరో యువకుడితో పెళ్లి జరిపారు.
అప్పటి నుంచి కమలాకర్ యువతిపై పగ పెంచుకున్నాడు. అదును కోసం ఎదురు చూశాడు. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు సీసాతో ఆమె గొంతు కోశాడు. ఆపై తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
దీంతో ఇద్దరిని స్థానికులు మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కమలాకర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.
Also Read : పిల్లల్లో వ్యాధుల నియంత్రణ : రోటావైరస్ వ్యాక్సిన్ ప్రారంభం